Digambara Digambara Sripada Vallabha Digambara ..... Digambara Digambara Sri Dattatreya Digambara

More ...

For Soundarya Lahari Audio, Spiritual Soup, Info on Spiritual Masters, Game of Life, Random Thoughts and more... visit our websites - SriDatta.info and SreeDatta.guru

Please email your feed back to sridatta50@gmail.com Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Are you liking audio stories?

30 June 2017

ఉపనిషత్తులు-10:ఆత్మ జ్ఞానం లేక బ్రహ్మ జ్ఞానం,

ఉపనిషత్తులు-10
ఆత్మ జ్ఞానం లేక బ్రహ్మ జ్ఞానం,


           సత్వగుణం చైతన్యంలో ఉంది. మిగతా రెండు గుణాలు రజోగుణం, తమోగుణం నిద్రాణ స్థితిలో ఉన్నాయి. ఇది సృష్టి ఏర్పడనప్పటి ముందు పరిస్థితి. అసలు సృష్టి ఎలా జరిగింది? ఈ అనంతమైనటువంటి ఈ బ్రహ్మము లోకాలను సృష్టించాలని అనుకుని సంకల్పం చేసుకున్నారని ఐత్రేయ ఉపనిషత్తులో పేర్కొనబడింది. అయితే మరి నిరాకర, నిర్గుణ స్వరూపమైనటువంటి అనంతంగా ఉండే ఈ బ్రహ్మము, శరీరం లేకుండా ఉండే ఈ బ్రహ్మము, మనస్సు లేకుండా ఉన్న బ్రహ్మము సంకల్పం చేసుకోవడం ఏమిటీ?అన్న ప్రశ్న మనకి ఉదయిస్తుంది. ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుందాం. ఏవిధంగా అయితే మనం స్విచ్ ని ఆన్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ బల్బ్ లో  విద్యుత్తు ప్రవేశించి వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ విద్యుత్తు వెళ్ళగానే నీవు వెలగాలని ఆగ్రహించడం జరగలేదు కదా ! ఇక్కడ సంకల్పం అంటే ఆయన ఏదో అలా అనుకున్నాడు కోరుకున్నాడు అని కాదు.  ఎప్పుడైతే బ్రహ్మము యొక్క చైతన్య శక్తి ఈ మాయ ఆవరించుకున్న ప్రదేశంలో ప్రవేశించిందో అప్పుడే సృష్టి కార్యక్రమానికి నాంది పలికింది అని మనం చెప్పుకోవాలి. అక్కడ బ్రహ్మ అనుకున్నాడు , సంకల్పించుకున్నాడు అంటే అది ఈవిధంగా ఉంది అని మనం చెప్పుకోవాలి. పై స్థాయిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విషయాలని చెప్పాలంటే కొద్దిగా క్రింది స్థాయిలోకి వచ్చి ఈ విధమైన ఉదాహరణతో మాత్రమే మనం చెప్పగలం. ఈ అనంతమైనటువంటి పరబ్రహ్మజ్ఞానానికి తగినంత భాష కాని పదాలు కాని మనకి లేవు. ఈవిధంగానే మనం ఉదాహరణలతో చెప్పుకోవాలసి వస్తుంది. మరి అనంతంగా పరబ్రహ్మముగా ఉన్నటువంటి ఈ బ్రహ్మములోని ఏ భాగము సంకల్పించుకున్నది అనే మరొక ప్రశ్న కలుగుతుంది. ఏ పరబ్రహ్మ చైతన్య శక్తి సృష్టికి ముందు మాయ లోని సత్వ గుణం లో మాత్రమే ప్రవేశించి దాన్నిమాత్రమే  చైతన్యం చేసిందో అప్పుడు మిగతా రెండు భాగాలు గా ఉన్న రజోగుణం, తమోగుణం నిద్రాణ స్థితిలో ఉన్నప్పుడు కేవలం అటువంటి బ్రహ్మచైతన్యానికి మాత్రమే ఈ సృష్టి చేసే శక్తి వచ్చింది అని చెప్పి ఉపనిషత్తులు పేర్కొన్నాయి. ఎందుకంటే అక్కడ  సత్వగుణం లో ప్రవేశించినటువంటి బ్రహ్మము మాయని  ఉపాధిగా గ్రహించింది కాబట్టి కేవలం ఆ బ్రహ్మచైతన్యానికి మాత్రమే సృష్టి చేసే సామర్థ్యం  కలిగింది. మిగతా పరబ్రహ్మములో ఎటువంటి సంకల్పాలు కాని ఆకారాలు, వికారాలు కాని ఉండనే ఉండవు అని ఈవిధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి శక్తిని ఈశ్వరుడుగా భావిస్తూ ఉంటారు. అంటే అనంతచైతన్యంలోని పరబ్రహ్మ మాయలోని కేవలం సత్వగుణలో ప్రవేశించి అక్కడ మాయరూపాలుగా గ్రహించి నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి రజోగుణం, తమోగుణం కూడా చైతన్యమైనప్పుడు సృష్టి చేసేటటువంటి ఆ శక్తిని ఈశ్వరుడని పేర్కొనడం జరిగింది. కాని మరి ఇక్కడ ఈశ్వరుడంటే బ్రహ్మ,విష్ణు, మహేశ్వరుల లోని మహేశ్వరుడా అని సందేహం వస్తుంది కాని ఆ ఈశ్వరుడు కాదు. అటువంటప్పుడు మనం ఈశ్వరుడు అని చెప్పకుండా బ్రహ్మము అని చెప్పవచ్చును కదా అనే మరొక సందేహం వస్తుంది. దానికి సమాధానం ఏమిటంటే అనంత పరబ్రహ్మ ఎటువంటి సంకల్పం లేకుండా నిర్వికారంగా ఉన్నాడో అటువంటి బ్రహ్మకి సృష్టి చేసే శక్తి లేదు. ఎందుకంటే అక్కడ మాయ అనేది లేదు కాబట్టి . అయితే ఇక్కడ బ్రహ్మచైతన్యం ఎప్పుడైతే మాయలోని సత్వ, రజో, తమోగుణం లో వ్యాపించినప్పుడు అక్కడ మాయని ఉపాధిగా గ్రహించింది కాబట్టి అక్కడ ఈశ్వరుడు అనే శక్తికి ఈ సృష్టి చేసే సామర్థ్యం కలిగింది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇది ఇంకొక విధంగా చెప్పాలని అనుకుంటే బ్రహ్మచైతన్యం ఎప్పుడైతే సత్వగుణ ప్రధానంగా ఉన్నటువంటి మాయలో వ్యాపించిందో ఆ శక్తి రజోగుణం, తమోగుణం లో ఎప్పుడైతే చైతన్యంగా వ్యాపించిందో అటువంటి శక్తిని బ్రహ్మము యొక్క శక్తి ప్రతిఫలించింది అని చెప్పుకొనవచ్చును. ఏవిధంగా అయితే  విద్యుత్తు ఒక ఫ్యాన్ లో ప్రవేశించింనప్పుడు దానికి చైతన్యం కలిగి అది తిరగడం మొదలు పెడ్తుందో దాన్ని మనం అక్కడ విద్యుత్తు ప్రతిఫలించింది అని చెప్పుకోవచ్చును. ఇక్కడ బ్రహ్మము అని మనం ఎందుకు చెప్పుకోకూడదంటే లోగడ చెప్పినట్టుగా అనంతపరబ్రహ్మము మిగతా మూడు దిక్కులా వ్యాపించినటువంటి అనంత పరబ్రహ్మానికి మాయ అనే ఉపాధి లేదు కాబట్టి అక్కడ దానికి సృష్టి చేసే శక్తి లేనే లేదు అని దీని అర్థం.


సృష్టికి నాంది.
ఎప్పుడైతే అనంత పరబ్రహ్మలోని శక్తి ఎప్పుడైతే మాయలోని సత్వగుణం లో వ్యాపిస్తుందో , మిగతా రజోగుణం, తమోగుణం నిద్రాణ స్థితిలో ఉన్నాయో ఆ సమయంలో ఈ సత్వగుణం లో ఉన్నటువంటి ఈ బ్రహ్మచైతన్యం ఇప్పుడే దాన్ని ఈశ్వరుడని చెప్పుకున్నాం. ఆ చైతన్యం ఎప్పుడైతే రజో,తమోగుణాలలో  ప్రవేశించి ఆ రెండింటినీ చైతన్యం చేస్తుందో అంటే ఎప్పుడైతే సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఈ మూడు కూడా చైతన్యవంతం  అయినాయో అప్పుడే అవిద్య ఏర్పడుతుందని ఇంతకుముందే మనం చెప్పుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ అవిద్య ఉద్భవించిందో అప్పుడే ఈశ్వరుడికి ఈ సృష్టి కార్యక్రమానికి కావలసినటువంటి ఈ మూడు మూలపదార్థాలు కలిసి అవిద్య అనే శక్తి లభించి దానీతో ఈ సృష్టి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. సృష్టిలో ఈవిధంగా ఎప్పుడైతే త్రిగుణాలు చైతన్యవంతమై అవిద్యగా  ఏర్పడ్డాయో, అవిద్యనుండి  మొట్టమొదట  పంచభూతాలు ఉద్భవించాయి. ఈ పంచభూతాల్లో మొట్టమొదటిది ఆకాశం. దీనియొక్క గుణం సత్వం. ఆకాశం సత్వగుణ ప్రధానంగా పుట్టింది అని చెప్పుకొనవచ్చును. మన మహర్షులందరూ కూడా ఈ ఆత్మజ్ఞానాన్ని ఎంతో తపస్సు చేసి, ఏకాగ్రతతో వారు ఈ బ్రహ్మజ్ఞానాన్ని వినడం, దానిని చూడడం, దానిని వారు తమ గ్రంథాల్లో పేర్కొనడం జరిగింది. ఒక మహర్షి ఓంకారం మొదలు పుట్టిందని చెప్పడం, ఇంకొక మహర్షి మొట్టమొదట శబ్దమే పుట్టిందని చెప్పడం, ఇంకొక చోట ఆకాశం ముందుగా పుట్టిందని చెప్పడం జరిగింది. అయితే ఈ మూడు కూడా సరి అయినవే. ఆకాశం పుట్టిందంటే అది సత్వగుణం ప్రధానం కాబట్టి దానితో పాటు శబ్దం కూడా వచ్చిందని చెప్పుకోవాలి కదా ! ఆ శబ్దాన్నే ఇంకొక మహర్షి ఏకాగ్రతతో విన్నప్పుడు అది ఓంకారంగా ఆయనకి వినపడింది , దర్శనం కలిగింది కాబట్టి వారు అలా చెప్పారు. ఏవిధంగా మొట్టమొదటిసారిగా ఈ పంచభూతాలు ఉద్భవించడం, దానిలో ఈ ఆకాశం సత్వగుణ ప్రధానంగా ఉద్భవించడం జరిగింది. ఈవిధంగా ఆకాశం ముందు పుట్టింది అని చెప్పుకున్నాం. మొట్టమొదట ఆకాశం జడంగా ఉండింది. ఎప్పుడైతే బ్రహ్మచైతన్యం ఇందులో  ప్రవేశించిందో అప్పుడు ఈ ఆకాశం నుండి  వాయువు పుట్టింది. పుట్టిన వాయువు ముందు జడంగా ఉండి దానిలో ఎప్పుడైతే బ్రహ్మచైతన్యం ప్రవేశించిందో, దానిలో ఎప్పుడైతే చైతన్యం కలిగిందో అప్పుడు ఈ వాయువు నుండి అగ్ని పుట్టింది. ఈ పుట్టిన అగ్ని ముందు జడంగా ఉండి దానిలో ఎప్పుడైతే బ్రహ్మచైతన్యం ప్రవేశించిందో, అప్పుడు మళ్ళీసృష్టి జరిగి దాని నుండి జలం పుట్టింది. ఈ జలం ముందు జడంగా ఉండి దానిలో ఎప్పుడైతే బ్రహ్మచైతన్యం ప్రవేశించిందో, ఎప్పుడైతే సృష్టి జరిగిందో అప్పుడు దాని నుండి భూమి పుట్టింది. పుట్టిన భూమి మొదట జడంగా ఉండి దానిలో ఎప్పుడైతే బ్రహ్మచైతన్యం ప్రవేశించిందో అప్పుడు మళ్ళీ ప్రకృక్తి మొదలయింది, సృష్టి మళ్ళా మొదలయింది. భూమి చైతన్యవంతం అవడం సంభవించింది. ఈవిధంగా  ఒక దాని నుండి ఒకటి ఈ పంచభూతాల ఆవిర్భావం కలిగింది. అగ్నికి రూపగుణం, జలానికి రసగుణం మరియూ భూమికి గంధగుణం ఉన్నాయి.ఈ విధంగా శబ్ద,స్పర్శ,రూప,రస, గంధ తత్వాలు  ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క గుణంగా ఉన్నాయి. వీటినే సప్త భూతములు  లేక శన్మాత్రాలు అని కూడా వ్యవహరిస్తారు.  ఈ ఐదు సూక్ష్మ భూతాల నుండి ఐదు సూక్ష్మ తత్వాలు పుట్టాయి.