Digambara Digambara Sripada Vallabha Digambara ..... Digambara Digambara Sri Dattatreya Digambara

More ...

For Soundarya Lahari Audio, Spiritual Soup, Info on Spiritual Masters, Game of Life, Random Thoughts and more... visit our websites - SriDatta.info and SreeDatta.guru

Please email your feed back to sridatta50@gmail.com Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Are you liking audio stories?

21 July 2017

దేవదత్తుని వృత్తాంతం - 11_b

దేవదత్తుని వృత్తాంతం - 11_b
వల్లభదాసు పథకం,

 జిల్లా కలెక్టర్ గారు జవాబుగా ఇచ్చిన ఉత్తరంతో వల్లభదాసుకు దత్త ప్రభువు సహాయంతో సమస్య తొలగుతుంది అని నమ్మకం కుదిరి స్వామి వారి పూజలో నిమగ్నం అయ్యాడు. అదే సమయంలో సుమతి అనన్య భక్తితో శ్రీపాదశ్రీవల్లభ స్వామి వారి గురించి అహర్నిషలు ధ్యానం చేస్తోంది. జిల్లా కలక్టర్ గారు అన్ని జిల్లాల యంత్రాంగానికి కపట సన్యాసి చిత్ర పటాలతోసహ హెచ్చరికలు పంపారు. దాంతో రాష్ట్రయంత్రాంగం అంతా కదలింది. అయితే ఈవిషయాలను అన్నింటిని రక్షణ ద్రుష్ట్యా గోప్యంగా ఉంచడం జరిగింది. వాల్లు కొన్ని రహస్య వ్యూహాలు చేసి వాటికి అనుగుణంగా ఎంతో మంది ఈ చర్యల్లో పాల్గొనడానికి సాధారణ దుస్తుల్లో రావడం వంటి జాగ్రత్తలు కుడా తీసుకున్నారు.మరునాడు జరగబోయే దత్త యాగానికి వేలసంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులు చాలా మంది ముందుగానే ధన విరాళాలు, వస్తు విరాళాలు,యాగసామాగ్రి విరాళాలు ఇచ్చారు.  అక్కడ ధనవంతులైన భక్తులకు అగ్రస్థానం ఇవ్వడం జరిగింది. దాదాపు 20 కుండీల యాగం ప్రారంభం అయ్యింది. దీన్ని వీక్షించేందుకు ఎంతో మంది దత్త మహా యజ్ఞంలో  పరిపక్వత సాధించినటువంటి  ఘనాపాటీలు కూడా కర్ణాకర్ణిగా స్వామివారి గురించి విని అక్కడకు విచ్చేయడం జరిగింది, అసలు విషయాలు వారికి కూడా తెలియదు. ఈ ఘనాపాటీలు అందరూ వయోవృద్దులు, వారిని ఎవరు ఆహ్వానించక పోయినప్పటికి దత్తస్వామిపైన వున్న భక్తితో వారే స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చారు. 





వయసు అనుభవము ఉన్న వృద్ధ బ్రాహ్మణులు అంతా అక్కడ జరిగే తంతు చూసి విస్తుపోయారు.అక్కడ ఎటువంటి మంత్రోచ్ఛటన లేదు, కాసేపు "దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర" అనే నామజపం, తరువాత ఆ సన్యాసి పేరుతో నామాజపం చేస్తూ అక్కడ వచ్చిన పేద, ధనిక అను భేదం లేకుండా అందరిచేత ఖరీదైన ఆవునెయ్యిని ఆహుతులుగా వెయిస్తున్నారు. భక్తి భావం లేకుండా హవనం పొడిని కూడా ఇష్టం వచ్చునట్టు యజ్ఞంలో చల్లడం చేస్తున్నారు.అక్కడ యజ్ఞ విధి అంతా విధి పూర్వకంగా కాకుండా, యాంత్రికంగా జరిగిపోతోంది. భక్తజనం కూడ క్రమశిక్షణ లేకుండా తోసుకోవడం వంటివి చేస్తున్నారు.


మన  సనాతన ధర్మంలో వేదాలకు, యాగాలు ఒక విశిష్టమైన స్తానం ఉన్నది.  దానిలో మంత్రశాస్త్రం ఒకభాగం, స్వయంగా దత్తస్వామి వారు వేదాలను ఎంతో గౌవరవించేవారు, గాయిత్రి యజ్ఞం విధిపూర్వకంగా చేస్తూవుండేవారు. ఎందుకంటే గాయత్రియందే సమస్త శాస్త్రం ఇమిడి ఉంది. శ్రీపాద చరితామృతంలో స్వామి స్వయంగా "అహర్నిశలు ఎవరతే నా నామజపం చేస్తారో వారికి స్వయంగా దర్శనం ఇస్తాను" అని చెప్పారు. కాని ఇక్కడ జరిగే ప్రక్రియ శాస్త్రవిరుద్ధంగా ఉన్నది. అక్కడ చేరిన బ్రహ్మణోత్తములు అంత నిర్ఘాంతపోయారు, దేశంలో జరిగే అన్ని యాగాలకు, హోమాలకు, తంతుకు విరుద్ధంగా ఇక్కడి ప్రక్రియలు జరుగుతున్నవి. కొన్ని లక్షలు ఖరీదు చేసే స్వఛ్చమయిన ఆవునెయ్యి ఇలా అగ్నిపాలు కావడం.చేసేవాళ్ళు కూడా యాంత్రికంగా చేయడం చూసి బ్రాహ్మణులంతా కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. భక్తుల్లో కూడా కొందరుఆడా, మగ  తేడ తెలియని విధంగా  ఆధునిక దుస్తులు ధరించి పూజా విధానంలో పాల్గొని ఉండటం, శుచి శుభ్రం లేని పూజ విధానాలు వాళ్లకు భరించరాని విధంగా ఉన్నాయి. కానీ ఏమి అడ్డుచెప్తే ఏమిజరుగుతుందో అన్న భయం కూడా  వారిలో లేకపోలేదు.  గౌరవభంగం కాకూడదు అని బయటికి కూడా వెళ్ల లేక పోయారు, ఈ తతంగానికి వారు ప్రేక్షకపాత్ర పోషించ వలసి వచ్చింది.

బాగా అలంకరించి ఉన్న వేదికపై వెండి సింహాసనం మీద కూర్చుని ఆ సన్యాసి ఈ యాగాలనన్నింటిని గమనిస్తూ వున్నాడు.ఆయన చుట్టూ సపర్యలు చేస్తూ భక్తులు (ఎక్కువ భాగం స్త్రీలు) వున్నారు. కాసేపటికి ఆ సన్యాసి తన ఆంతరంగ గదిలోకి వెళ్లిపోయారు. కొంతమంది అధికమొత్తంలో దక్షిణ ఇచ్చిన వారతో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది.  ఆసన్యాసి తాగిన చుట్టల భస్మం తీసుకుంటే ఉబ్బసవ్యాధి లాంటి పోతాయి అని అతని అనుచరులు ప్రచారం చేయడంతో చాలా మంది అక్కడ గుమికూడారు. దక్షిణ ఇచ్చిన భక్తులకు మాత్రమే ఆ స్వామి వారి తాగి విదిల్చిన చుట్టాలు, బీడీల, సిగిరెట్ల బూడిద పంచడం వాళ్ళు చాలా జాగ్రత్తగా భద్రపరుచుకొని దాన్ని ఇళ్లకు తీసుకు పోయే ప్రయత్నం చేయడం, ఇదంతా చూస్తున్న వల్లభదాసుకు చాలా బాధతోపాటు ఆగ్రహం కలిగింది.
మిగిలినది తరువాయి భాగంలో..

Swaminarayana Telugu Audio chapters 13, 14 & 15 are available now. Please click here.




18 July 2017

దేవ దత్తుని వృత్తాంతం 11

దేవ దత్తుని వృత్తాంతం 11
వల్లభదాసు యొక్క కీర్తి 


నాగనాథుడు తన మనో నేత్రానికి కనిపిస్తున్నఈ వ్యవహారాన్ని ఎంతో ఆసక్తిగా గమనిస్తూ వున్నాడు.  వల్లభదాసు రాజమ్మగారు వెల్లిన తదుపరి, స్నానానంతరం పూజా మందిరంలో శ్రీపాదవల్లభుని ముందు ధ్యానం లో కూచున్నారు. సమస్యల పరిష్కారానికి దత్త ధ్యానం చేయడం వల్లభదాసుకు అలవాటు. ఆరోజు ధ్యానానంతరం  వల్లభదాసు ధైర్యంగా వుండడం చూసి అతని అనుచరులు సంతోపడ్డారు.అతను తన ఆంతరంగిక అనుచరులను పిలిచి కొన్ని ఆదేశాలను ఇచ్చి పంపడం జరింది. తరువాత మరికొందరికి ఏవో ఉత్తరాలు రాసి ఇచ్చి పంపివేసారు. తరువాత కమలమ్మగారికి ఏవో ఆదేశాలను ఇచ్చి రాజమ్మగారి దగ్గరకు పంపారు. 

రాజమ్మగారి కుమార్తె సుమతి చాల తెలివైన అమ్మాయి, లౌకికజ్ఞానం కలిగినది. శ్రీపాదుని పై అనన్య భక్తి కలిగినది  అయినందు వల్ల తనకు రాబోవు ప్రమాదము పసిగట్టి శ్రీపాదుని పరి పరి విదముల తనను కపాడమని వేడుకుంటోంది.తన తండ్రి, నాన్నమ్మగారు కపట సన్యసిని నమ్మడం ఆ అమ్మయికి ఎంతో అయిష్టతగా ఉంది.ఈ లోపు కమలమ్మగారి ద్వారా అందిన వల్లభదాసు ఆదేశాలను రాజమ్మ తన కుమార్తెకు  చేరవేసింది.  తరువాత తన భర్తను పిలిచి అతనికి  సుమతి గురిచి ఎదో చెప్పడంతో, ఆమె భర్త స్వామి వారి దగ్గరకు వెళ్ళి ఏదో సర్ది చెప్పడంతో ఆ కపట సన్యసి సరే అంటూ నాలుగు రోజుల తరువత అమ్మయిని వెంటపెట్టుకురమ్మన్నారు.ఇదంత చూసి రాజమ్మ తన కుమార్తె రక్షింపబడటానికి నాలుగు రోజుల సమయం దొరికినందుకు సంతసించింది. ఈలోపు వల్లభదాసు శ్రీపాదుని అండతో ఎదో ఒకటి చేసి తన కుమార్తెను రక్షిస్తాడు అని విశ్వసించింది.సుమతి ఈ విషయం తెలిసి ఈ అయిదు రోజులు శ్రీపాదుని ధ్యానంలో ఏకభుక్తం చేస్తూ తన సమయం గడపాలని నిర్ణయించుకుంది. ఆమె తండ్రి మరి కొంత మంది జనులు ఆ స్వామీజీపై మూఢవిశ్వాసం కలవారు అవడం చేత స్వామీజీకి లేని మహిమలు ఆపాదించి తెలిసిన బందు,మిత్రులకు ప్రచారం చేస్తున్నారు.

ఆరోజు మధ్యహ్న సమయంలో స్వామివారు దత్త హోమం చేస్తారు దానిలో పాల్గొనదలచిన వారు హోమమునకు కావలసిన నెయ్యి, ద్రవ్యాలతో రావలసిందిగా చాటింపువేసారు.అన్నదానంలో పాల్గునేవారిద్వారా, హోమంలో పాల్గునేవారి ద్వారా ఎంతో వ్యాపారం చుట్టుప్రక్కల దుకాణాలలో జరిగింది.పెద్ద సంఖ్యలో ధనిక, పేదా అను తేడా లేకుండా భక్త జనం గుమి కూడారు, పందిల్లు వేయపడ్డాయి,  అన్నదాన సామాగ్రి సమకూడింది. ముందుగా ధనం చెల్లించిన దుకాణదారులు  దుకాణాలలోనే స్వామి అనుచరులు నిర్దేసించిన విదంగా అమ్మకాలు జరుగుతున్నాయి. వాటిలో స్వామివారి చిత్రపటాలు, స్వామి వారి అభిషేకతీర్థం లాంటివి వేల సంఖ్యలో మూఢభక్తులకు అమ్మసాగారు. ఎంతో మంది  స్వామివారి సన్నిహితులు అయిన విధ్యావంతులు, అధికారులు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. రక్షకశాఖాధికారి స్వామి వారి  భక్తుడు అవటం చేత   రక్షకభటులు కూడా ఎటువంటి గొడవలు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు.

వల్లభ దాసు రాసి ఇచ్చిన ఉత్తరాలు జిల్లా అధికారికి అందించారు వల్లభదాసు అనుచరులు. అది చదివి ఆ అధికారి తన యంత్రాంగానికి చేయవలసిన పనులను పురమాయించారు. ఎప్పటిలాగా ఈసారి కూడా శ్రీపాదుని లీలల మహత్యం వెల్లడి కాబోతున్నందులకు వల్లభదాసు, అతని అనుచరులు ఎంతో ఆనందంతోను ఆసక్తితోను ఎదురు చూస్తున్నారు.

8 July 2017

దేవదత్తుని వృత్తాంతం - 10

దేవదత్తుని వృత్తాంతం - 10

వల్లభ దాసు యొక్క కీర్తి,

వల్లభదాసు కొద్ది మంది అనుచరులతో కలిసి తమని అవధూతగా చెప్పబడే సాధువు ఉన్న నివాసానికి చేరుకున్నాడు. ఆప్రాంతం అంతా అట్టహాసంగా, కోలహలంగా ఉన్నది. అక్కడ పందిరి వేసి ఉన్నది, దాని క్రింద ఆ కపట అవధూత అనుచరులు కూర్చొని అతని మహత్తున్ని పలురకాలుగా చెపుతూ వచ్చారు. ఆ సమయంలో ఆ స్వామి అభ్యంగన స్నానం చేస్తువున్నారు. ఆ స్వామి అభ్యంగన స్నానం చూడాలి అనుకున్నవారు 100 రూపాయలు చెెల్లించి స్వామి వారి దగ్గరకు వెళ్ళవచ్చు అని చెపుతున్నారు. ముందుగా స్త్రీలకు అవకాశం ఇచ్చారు. అక్కడి స్త్రీలందరు 100 రూపాయలు కట్టి స్వామివారు స్నానము చేస్తున్న గదిలోకి వెళ్ళ సాగారు.

స్వహస్తాలతో స్నానం చేయించాలి అనుకున్నవారు 500 రూపాయలు ఇచ్చి తమ చేతులతో స్వామికి భగవంతునికి  అభిషేకం చేసే భావంతో చేయవచ్చు అన్నారు. అలా చేసే వారికి కష్టాలు తొలగి, సిరి సంపదలు కలుగుతాయి అని ప్రచారం చేస్తున్నారు. జనం అంతా ఆ అవకాశం కోసం  500 రుసుము చెల్లించి ఆ కార్యక్రమంలో పల్గొనడం జరిగింది. ఎంతో మంది మహిళలు స్వామి వారి దగ్గరకు వెళ్లడం జరిగింది. పథకం ప్రకారం వల్లభదాసు తన సహచరులలో ఒకరి శ్రీమతిని ఆ కార్యక్రమం చూడటానికి పంపడం జరిగింది. ఆ గదిలో చాలా కోలాహలంగా ఉన్నది పురుషులెవ్వరికి ప్రవేశం లేదు. స్వామి వారు ధ్యాన స్థితిలో ఉన్నారు కేవలం గోచి గుడ్డను ధరించి జుట్టు జడలతో ధ్యాన స్థితిలో ఉన్నారు. ఖరీదైన అభ్యంగన సామగ్రి కొని స్త్రీలు లోన గుమిగూడారు, వారిలో కొందరు మహిళలు ఇది మహా భాగ్యం అని ప్రచారం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో వల్లభదాసు అనుచరుని శ్రీమతి కమలమ్మ ముగ్గరు స్త్రీలను గమనించింది. వారు ముగ్గురు  పూనకం పట్టినట్టుగా ప్రవర్తిస్తున్నారు.వాళ్ళు మాకు ఉన్న కీళ్ల నొప్పుల జబ్బు ఎంత ఖర్చు చేసి వైద్యం చేసుకున్నాతగ్గనిది స్వామి వారి అభిషేకం లో పాల్గొనడం వల్ల ఈ మూడురోజుల్లో తగ్గింది అని ప్రచారం చేస్తున్నారు.స్వామి వారు కూడా స్త్రీలు చుట్టూ చేరి మర్ధనలు చేస్తూ స్నానం చేయిస్తూ ఉంటే తన్మయత్వంతో ఆనందిస్తున్నారు. ఇదంతా చూస్తన్న కమలమ్మగారికి చాలా జుగుప్సా భావం కలిగింది. ఈ తతంగం చూస్తున్న కమలమ్మగారికి అక్కడ ఉండాలని అనిపించలేదు. కానీ ఆమెకు  ఇంట్లో అత్త మామలైన పెద్దలను గౌరవించని, ప్రేమను పంచలేని  తనకు తెలిసిన మహిళలు కూడా స్వామి వారికి స్నానము చేయిస్తూ కనిపించారు. మధ్య మధ్యలో స్వామి వారు కళ్ళు తెరిచి ఆ ఆడవారిని కొడుతున్నాడు.

వారితో ఏవో పరాచకాలు ఆడుతూ వున్నాడు. ఇతనికి చేస్తున్న సేవ ఎందుకు అత్తమామలకు వీరు చేయలేక పోతున్నారు అని కమలమ్మ ఆలోచనలో పడ్డారు. ఇంక అక్కడ ఉండలేక వచ్చేస్తున్న ఆమెకు బయటి ఖాలీస్థలంలో నుంచి ఎదో వాగ్వివాదాలు  కిటికీ ద్వారా వినిపించాయి, ఆమె ఎవరి కంట పడకుండా అది ఏమిటి అని గమనించ సాగింది. మధ్య వయస్కుడైన ఒక స్వామి వారి అనుచరుడు ముగ్గురు మహిళలతో వాగ్వాదం చేస్తున్నారు. ఆ మహిళల్లో ఒక ఆవిడ ,"ఏమయ్యా రంగదాసు నువు చెప్పినట్లే మేము ఎంతో ప్రచారం చేసాము ఇప్పటికే నేను పదిమందిని స్వామి వైపు ఆకర్షితులను చేసాను, నా వాటా ఎందుకు ఇంకా ఇవ్వలేదు అన్నది, మిగిలిన మహిళలు లేని జబ్బులు చెప్పి స్వామి వారి అభిషేకం తో నయం అయ్యాయి అని చెప్తున్న మా మాటలకు ఎంతో మంది ఆకర్షితులు అవుతున్నారు మా వాటా ఇవ్వు అన్నారు. దానికి రంగదాసు "అమ్మ నా వాటా కూడా మూడువేల వరకు రాలేదు. అది వస్తే  కానీ నేను మీకు ఇవ్వలేను. ఈలోపు మీరు గొడవ చేస్తే ఎవరి కంట్లో అయిన పడితే మనకు దేహ శుద్ధి జరుగుతుంది. కాబట్టి దయ చేసి ఓపిక పట్టండి అని ప్రార్థించాడు." ఇది అంత గమనించిన కమలమ్మ మాట్లాడ కుండా మెల్లగా బయటకు వచ్చి వల్లభదాసు సహచరులను  సైగలతోబయటకు తీసుకు వచింది.ఇది అంత వల్లభదాసు గమనిస్తూనే వున్నారు.వల్లభదాసుకు కపట సన్యాసి విషయంలో ఉన్న అనుమానం నిజమని తేలింది. తదుపరి ప్రణాళిక ఏమిటా అని వల్లభదాసు ఆలోచనలో పడ్డారు. 


ఆరోజు సాయంత్రం వల్లభదాసు ఇంట్లో ఉండగా రాజమ్మ గారు వచ్చి " నాయనా ఎలాగైనా నువ్వే నా కూతుర్ని రక్షించాలి. మా ఇంట్లో ఎవరూ నామాట వినటం లేదు, నాకుతురికి  ఏవిధమైనటువంటి జబ్బు లేదు, కానీ మావారు, మా అత్తగారు అమాయకత్వంతో బయట వారి మటలు నమ్మి  ఈ స్వామి వారిని ఇంటికి పిలిపించి పాదపూజ చేసి 1116 సమర్పించారు. ఆ స్వామి వారి దృష్టి నా కుతురి మీద పడింది. అతను మా అత్తగారిని పిలిచి మీ మనవరాలిని చూసాను ఆమెకు మీకు తెలీకుండా ఒక రుగ్మత అనగా ఒక చెడు గాలి సోకింది. ఇది ఆమెకు కాని మీకు కాని తెలీకుండా అలా జరిగింది. మీరు ఆమెను కాపాడుకోండి అన్నాడు. దానికి మావాల్లు భయపడి మీరె ఏదో ఒకటి చేసి తనను కాపాడండి అన్నారు. దానికి అతను  రాత్రి సమయం 7 గంటల ప్రాతంలో మీ అమ్మాయిని నా దగ్గరకు తీసుకు రండి ఆమెకు నేను నయం చేస్తాను అన్నాడు. నాకెందుకో అతని ప్రవర్తన చూపులు నమ్మదగ్గవిగా అనిపించడం లేదు. తల్లిగా నాకు తెలుసు నాకుతురు ఆరోగ్యవంతురాలు, అతడు ఏదో చెడు ఉద్దేశంతో అలా అన్నట్టు నాకు అనిపిస్తూన్నది. కాబట్తి నువ్వే ఎదో ఒకటి చేసి నా బిడ్డను రక్షించు నాయనా వల్లభదాసు అని బ్రతిమాలుకున్నది. 
 

మొదటి రోజు స్వామి వారి దగ్గరకు వెల్లినప్పుడు స్వామి  ఇచ్చిన పాలు త్రాగి నా కూతురు మత్తుగా కూచున్న దగ్గరే నిద్రలోకి జారుకున్నది. ఆమెను ఏకాంతంగా గదిలొ వంటరిగా వుంచమని ఆమెకు ఎవో ప్రక్రియలు చేయలి అని చెప్పడంతో నాకు భయం అనిపించింది. దాంతో సమయస్ఫూర్తితో నేను ఈ రోజు పంచాంగం చూసాను మంచి రోజు కాదు అని ఒప్పించి మావరితో చెప్పి మా అమ్మాయిని ఇంటికి తీసుకు వచ్చాను. 

ఆ స్వామి రేపు అమ్మాయిని తీసుకు రమ్మని చెప్పాడు. కాబట్టి నువ్వే ఎదో ఒకటి చేసి నా బిడ్డను కాపాడు నాయనా వల్లభదాసు అని ఆర్తితో ప్రదేయపడింది. ఇది అంతా విన్న వల్లభ దాసు అమ్మా మీరు నిశ్చింతగా వెల్లండి దత్తుని దయతో శ్రీపాదుని అనుగ్రహంతో ఏదో ఒకటి చేసి మీ అమ్మాయిని రక్షిస్తాను అని అభయం ఇచ్చి పంపాడు.ఈ విషయం గోప్యంగా వుంచమని కూడా హెచ్చరించాడు. తరువాయి భాగం వచ్చే అధ్యాయములో ..

6 July 2017

దేవదత్తుని వృత్తాంతం - 9

దేవదత్తుని వృత్తాంతం - 9

వల్లభ దాసు యొక్క కీర్తి,

పరమ భక్తుడు అయినటువంటి వల్లభ దాసు, దత్తాత్రేయుని యొక్క తత్వాన్ని బాగా  అర్థం చేసుకున్నాడు. అందుకనే  కేవలం శ్రీ దత్తాత్రేయుల వారే అవధూత రెండవ వారు లేరు అని పూర్తిగా ఆకళింపు చేసుకున్నారు. అయితే సమాజం లో ఎంతో కొంత సాధన చేసిన తర్వాత చిన్న చిన్న మహిమలు చేసే సన్యాసులు యోగులు తమని తాము అవధూతలుగా ప్రకటించుకునే వారు రోజు రోజు ఎక్కువ కావడం,  ప్రజాలుకుడా దత్తాత్రేయుని లక్ష్యంగా పెట్టుకు న్నప్పటికి ఆదారిలో వెడుతూ మధ్యలో ఇటువంటి చిన్న చిన్న మాయలు చేసే గోసాయిల మాయలో పడుతూ భ్రష్టులవుతున్నారే అనే తపన వల్లభ దాసు మనసులో ఉండేది. అమాయకులయిన ప్రజల ధనాన్ని మానాన్ని కూడా ఇటువంటి కపట అవధూతలు, కపట సన్యాసులు హరిస్తున్నారే అనే ఆక్రోశం యెంతో అతనికి వుండేది.

అందువల్ల వల్లభదాసు చుట్టు ప్రక్కల ఎవరైనా అలాంటి కపట అవధూతలు, సన్యాసులు, సాధువులు వచ్చి ప్రజల్ని మోసం చేస్తుంటే అతని అనుచరులు అతనితో చెప్పడంతో వల్లభదాసు అనుచరులతో వెళ్లి దత్తాత్రేయునిపై భారం వేసి వారి భరతం పట్టేవారు.దీని వల్ల చిల్లర స్వాముల  వెంట వెళ్లడం వారిని గురించి లేనిపోని మహిమలు ఆపాదించి ప్రచారం చేయడం లాంటివి చేసే దత్తాత్రేయుని తత్వాన్ని సరిగా అర్థం చేసుకోలేని పండితులకు వల్లభదాసు అంటే కన్నెర్రగా ఉండేది. కానీ వల్లభదాసుకి ముఖ్యంగా పామరులు, కర్షకులు ఎంతోమంది అనుచరులుగా అండగా ఉండటం వల్ల అతన్ని వాళ్ళు ఏమి చేయలేక పోయారు.


ఇలాగే ఒకసారి ఒక అతడు తనను తాను అవధూతగా ప్రకటించడం వల్ల చాలా మంది జనులు అతని దగ్గరకు వెళ్లడం జరిగింది. ఆ కపట అవధూత శిష్యులు ఆ అవధూతకు దక్షణగా వచ్చిన ధనాన్ని ఆశించి, దానికి గాను లేనిపోని మహిమలు కపట అవధూతకు ఆపాదించి ప్రచారం చేసేవారు. ఐతే అవధూత తత్వాన్ని పింగలనాగుడికి ఏవిధంగా అయితే స్వామి దత్తపురణం లో చెప్పారో అది అణువణువునా జీర్ణించుకునివున్న వల్లభదాసుకి ఇటువంటి అవధూతలను చూస్తే చాలా కోపంగా ఉండేది. అయితే వల్లభదాసుకు అక్కడ దత్తస్వామి ఒక చేత్తో సూర్యుణ్ణి ముట్టుకున్నారు, మరో చేత్తో అశుద్ధం పట్టుకున్నారు అన్న విషయం బుర్రలో బాగా నాటుకుంది. అందుకని ఒకసారి వల్లభదాసు తనను అవధూతగా చెప్పుకుంటున్న ఒక అతని దగ్గరకు వెళ్లడం జరిగింది. అక్కడ జరిగినవి తరువాయి భాగం వచ్చే అధ్యాయంలో చెప్పుకుందాం.