Digambara Digambara Sripada Vallabha Digambara ..... Digambara Digambara Sri Dattatreya Digambara

More ...

For Soundarya Lahari Audio, Spiritual Soup, Info on Spiritual Masters, Game of Life, Random Thoughts and more... visit our websites - SriDatta.info and SreeDatta.guru

Please email your feed back to sridatta50@gmail.com Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Are you liking audio stories?

19 September 2017

దేవదత్తుని వృత్తాంతం - 15


దేవదత్తుని వృత్తాంతం

నాగనాథుని నిర్వేదన


దత్తస్వామి మరియు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికి భక్తుడైన నాగనాథునికి తాను చూస్తున్నదాంట్లో  దత్తభక్తులుగా తమని తాము చెప్పుకుంటున్న కపట స్వాములను తలచుకొని ఎంతో నిర్వేదన కలిగింది. ఒకప్పుడు పరశురాముడికి కూడా ఇలాంటి నిర్వేదన భావం కలిగింది. సాక్షాత్తు దత్తస్వామి అవతారమైన శ్రీపాదులు భూమిమీదకు వచ్చి ఎంతోమంది ప్రజలను ఉద్ధరించ వెళ్లిపోయిన అనతి కాలంలోనే ఇలాంటి వాళ్ళు ఎంత దుర్మార్గులుగా ప్రవర్తిస్తున్నారు. అసలు ఆ దత్తాతత్వాన్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదేమిటి అని, శ్రీపాదుని      పేరు చెప్పుకొనో లేదా నృసింహ సరస్వతి పేరు చెప్పుకొనో, షిరిడీ సా యిబాబా మహిమల గురించి పైకి చెప్పుకొనో అమాయక ప్రజల విశ్వాసాలను సొమ్ముచేసుకుంటున్నది చూసి  చాలా మదన పడ్డాడు. అయితే అతనికి ఒక సారి సాక్షాత్ శ్రీపాద శ్రీవల్లభ స్వామి తపస్సు చేసుకొనే ప్రదేశానికి వెళ్లి అక్కడ కూడా ప్రస్తుత పరిస్థితులు ఎలావున్నాయి అని గమనించాలని సంకల్పం కలిగింది.

అతను తన సంకల్ప శక్తితో తత్ క్షణం స్వామివారు తపస్సు చేసుకున్న కురువపుర క్షేత్రానికి వెళ్లడం జరిగింది. అక్కడ సాక్షాత్తు శ్రీపాదులు తపస్సు చేసుకున్న ప్రాతం ఎటువంటి సౌకర్యాలు లేకుండా పురతనంగా ఉండటం గమనించాడు. కానీ అక్కడ నియమింపబడ్డ బ్రహ్మణోత్తములు శ్రద్ధగా మడికట్టుకొని ఆ కృష్ణానది  పాయ నుండి నీళ్లు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకాలుచేస్తూ నిత్యపూజలు నిర్వహిస్తున్నారు.శ్రీవల్లభ స్వామివారు ఇచ్చిన ఆదేశాలప్రకారం ఒక కన్నడ బ్రాహ్మణ కుటుంబాన్ని కర్ణాటక రాష్ట్రంలోని ధార్వార్ నుండి తీసుకురావడం జరిగిందని ఆ వచ్చిన బ్రాహ్మణ కుటుంబం వారు అక్కడ పరిస్థితిని గమనించి నాలుగు వైపులా నీరువున్న ఆ ద్వీపాన్ని చూసి, మేము ఇక్కడ ఎలా జీవించగలం అని వాపోయారు.దత్త స్వామి ప్రియ శిష్యుడైన శ్రీ టెంబేస్వామి అక్కడి భక్తుల సహకారంతో శ్రీస్వామివారికి చిన్న ఆలయం కట్టించి, ఆ బ్రాహ్మణ కుటుంబాల అన్నదమ్ముల ఇద్దరికి నివాస యోగ్యమైన రెండు ఇళ్లను కట్టించి, వారి జీవనోపాదికై కొంత మంది భూస్వాముల సహాయంతో భూములను దానం చేయడం జరగడంతో వారు అక్కడే స్థిర నివాసం ఏర్పర్చుకోవడం జరిగింది. ఈ విధంగా స్వామి వారు ఆ రెండు కుటుంబాలను తన సేవకు నియమించుకున్నారు.

ఇప్పటికి ఆ కుటుంబాలకు చెందిన తరాలవారే వంతుల వారీగా స్వామివారి సేవచేసుకుంటూ భక్తులు ఇచ్చే కానుకలతో తమ జీవనాన్ని గడుపుకుంటున్నారు.భక్తులు ఇచ్చే సంబారాలతో మడికట్టుకొని చేసిన పదార్థములతో అన్నదానాలు చేస్తువున్నారు.ఆ కుటుంబీకులను భట్టాక కుటుంబీకులు అంటారు. స్వామివారు ప్రతినిత్యం కృష్ణా నదిలో స్నానం ఆచరించి సూర్యనమస్కారాలు చేసిన తరువాత నీటిమీద నడుచుకుంటూ రుక్మిణి పాండురంగని ఆలయానికి ఎదురుగా ఉన్న పశువుల పాకలో రోజూ దర్బార్ చేస్తుండేవారు అని తెలిసి అటుగా వెళ్లి చూసి నాగనాథునికి చాలా మనస్తాపం కలిగింది.ఆలయం పర్యవేక్షణ లేక పడుబడి, పశువులకు నివాసమై వాటి విసర్జన పదార్థములతో, భరించరాని దుర్గంధంతో నిండిఉన్నది.ఆలయంలో పూజావిధులు లేక పాడుబడివున్నది, పాండురంగని ఆలయం చూసి చాలా కలత చెందాడు.దత్త జయంతి రోజున, పుణ్య తిధుల రోజులలో అక్కడికి వచ్చిన భక్తులు సరైన వసతులు లేక రుక్మిణి ఆలయం వెనుక ఉన్న కాలి నడక దారిలో వచ్చి తొట్టిలో కూచుని కృష్ణా పాయనిదాటి వచ్చి శ్రీపాద స్వామిని దర్శించుకోడం గమనించాడు.ఆలయానికి వంశపారంపర్యంగా వస్తున్న ధర్మకర్తృత్వాన్ని నిర్లక్ష్యం చేస్తున్న కులకర్ణి కుటుంబాన్ని తలుచుకొని బాధవేసింది.ఆప్రదేశాన్ని పంచదేవపహాడ్ అని పిలుస్తారని తెలుసుకున్నాడు, కాలచక్రం అతని కళ్ళముందు వేగంగా తిరిగింది.

ఆయనకు ఒక సాధువు దత్తస్వామి భక్తుడు ఒకరు తన అనుచరులతో భక్తుల సౌకర్యార్థం ఆ ఆలయం వద్ద మెట్లు కట్టించి వారు తొట్టిల్లో ఆవలి వడ్డుకు చేరడానికి అనుకూలం కల్పించాలి అని  సంకల్పిచారు.స్థానికుల సహకారంతో ఆ జిల్లా అధికార యత్రాంగంతో సంప్రదించి ఆ ఆలయప్రాంగణాన్ని శుభ్రపరచి భక్తులద్వారా వచ్చిన విరాళాలు సేకరించి భక్తులకు సౌకర్యాలు కల్పించడం నాగనాథునికి సంతోషం కలిగించింది.మరియు శ్రీపీఠికాపురం సంస్థానం వారు ఈ ఆలయ ప్రగనంలో నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.ఈ ప్రక్రియ వెనుక ఒక బెంగాలీ సాధువు   యొక్క పట్టుదల శ్రమ ఉందని తెలిసి నాగనాథుడు సంతోషించాడు.కానీ నిధుల కొరత వల్ల ప్రతినిత్యం రుక్మిణీ పాండురంగని ఆలయం లో దీపారాధన కార్యక్రమం నిర్వహించడానికి సాధ్యపడలేదు.ఐతే పరిస్థితులు మెల్లగా మార్పులురావడం నాగనాథునికి సంతోషాన్ని ఇచ్చింది. స్వామి వారు తపస్సు చేసిన ప్రదేశంలోను, రుక్మిణీ ఆలయంలోను ధ్యానం చేసుకుంటూ సమయం గడపడం చేసాడు.

శ్రీవాసుదేవనంద సరస్వతి (శ్రీ టెంబే స్వామి)  ఏవిధంగా అయితే ధ్యానంలో శ్రీపాదస్వామి జన్మస్థానాన్ని కనుగొన్నారో అదేవిధంగా స్వామివారి తపస్సుచేసుకున్న స్థలం వెతుకుతూ పాండురంగని ఆలయానికి రావడం, అది క్రీస్తు శకం 1238వ సంవత్సరంలోనే నిర్మింపబడటం, అక్కడ బసచేసి స్వామివారు ధ్యానం లో శ్రీపాద స్వామి తపస్థానం, దర్బార్ ప్రదేశం, కురువపురం  కనుగొన్నారు అన్న విషయం నాగనాథుని మనోగతానికి అర్థం అయింది.
మిగిలిన విషయాలు తరువాయి భాగంలో.

14 September 2017

The Indigos

A small English story about Indigos by Adithi. Click here to listen

Swaminarayana Telugu Audio chapters 22, 23  & 24 are available now. Please click here.


12 September 2017

You opinion matters

Since we started audio version of the stories recently, we want to know your valuable feed back on audio stories.

Please answer the poll question on the right side ---->>>>>>^^^^^^^^

5 September 2017

దేవదత్తుని వృత్తాంతం - 14

దేవదత్తుని వృత్తాంతం - 14


ఇలా ఆ స్వామి వారి నుండి. కబురు రాగానే సుమతి తల్లిదండ్రులు వారి కుమార్తె ని తీసుకొని ఆయన దగ్గరకు వెళ్ళటం జరిగింది. అప్పటికే రాత్రి 9:30 కావస్తున్నది. అక్కడ చాలా మంది భక్తులు  ఏవో భజనలు పాడుకుంటున్నారు. కొంత మంది ఉన్మాద స్థితి లో ఉండి ఎంతో పరవశంతో రకరకాల హావభావాలతో నాట్యం చేస్తున్నట్టుగా ఊగిపోతున్నారు మరియు పాటలు పాడుతున్నారు. ఎంతో కొంత కవిత్వం తెలిసిన వారు ఆ స్వామి వారి మీద  ఎన్నో పాటలు కట్టి మహిమలు పొగుడుతూ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ  పాడుతున్నారు . ఆ స్వామి వారి మీద ఆఖరికి అష్టోత్తర శత నామావలి చదివి ఆయనకి హారతి ఇచ్చారు. చాలా మంది భక్తులు ఆ హారతి పళ్ళెంలో చాలా డబ్బులు వేయటం జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ కాఫీలు, టిపినీలు సమర్పించుకున్నాక అందరూ వెళ్లిపోయారు. ఈ తతంగం అయిపోయే సరికి 10:30 అయింది. స్వామి వారు అందర్నీ పంపించివేసి సుమతి తల్లిదండ్రులను బయటికి పంపించివేశారు. మీ కుమార్తె కు వచ్చిన భయం ఏమీ లేదు నా రక్షణలో ఉంటుంది. మీరు సుఖంగా మీ ఇళ్లకు వెళ్ళండి అని చెప్పగా వారు అలాగే స్వామి అని బదులిచ్చి  నిష్క్రమించారు. కానీ ఇంటికి వెళ్ళాక రాదమ్మ గారు రహస్యంగా ఆ స్వామి వారు బస చేసిన ప్రదేశం దగ్గరకి వచ్చింది.


ఈ లోపల వల్లభదాసు అనుచరులందరు కూడా నిశ్శబ్దంగా ఎవరికి ఏ మాత్రం అనుమానం రాకుండా అక్కడే చుట్టుపక్కల తిరుగుతున్నారు. నిద్ర నటిస్తున్నారు. చాలా మంది సిఐడి పోలీసు శాఖ వారు మారువేశాల్లో జనం మధ్యలో తిరుగుతూ, అందరిని గమనిస్తూ, వాళ్ళు కూడా నిశ్శబ్దంగా వారికి వచ్చిన ఆదేశాల విధంగా వారి వారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కొంత మంది మహిళ పోలీసులు భజనలు చేస్తున్న వారిలో కలిసిపోయి ఎవరికి ఏ మాత్రం అనుమానం రాకుండా సుమతి ఉన్న గదిలోనే ఉండటం జరిగింది. ఆ గదిని ఆనుకొని ఉన్న గదిలో ఇంకొక మహిళా పోలీస్ మామూలు సాదాసీదా దుస్తుల్లో ఉండి అన్ని గమనిస్తుంది. అక్కడ ఒక స్త్రీ రహస్యంగా వచ్చి ఎవరు లేరనే ధీమాతో పాలలో పొట్లం లోని మందు కలపటం, ఆ కలిపిన మందు సుమతికి ఇవ్వబోతుందని గ్రహించిన ఆ మహిళ పొలీస్ నిశ్శబ్దంగా ఆ స్త్రీని వెనక నుంచి పట్టుకొని, నోరు నొక్కి ఆమె కాళ్ళు చేతులు కట్టి మామూలు పాలగ్లాసుని తీసుకొని సుమతి ఉన్న గదిలోకి వెళ్లి రహస్యంగా ఏం భయపడకు సుమతి నేను ఉన్నాను నీకు రక్షణగా అని చెప్పటంతో  ముందే పథకం అంతా తెలిసిన సుమతి నిబ్బరంగా ఉండిపోయింది. ఆ గది మొత్తం పోలిసు వారు మారు వేశాల్లో ఉండి అంతా గమనిస్తుండగా ఈ లోగా స్వామి వారు సుమతి ఉన్న గదిలోకి ప్రవేశించారు. ఒళ్ళంతా సుగంధ పరిమళాలు చల్లుకుని వచ్చి అతను వచ్చి రాగానే అమ్మాయి నీకు ఏం భయం లేదు నేను సాక్షాత్తు అవదూత స్వామిని కాబట్టి నీ వ్యాధిని నయం చేస్తాను నన్ను మాత్రం నువ్వు సేవించుకో అని సమీపంగా రాసాగాడు. అతని నోటినుంచి గంజాయి వాసన రావటంతో సుమతి తల తిప్పుకున్నది. మనసులో ఆమె శ్రీపాద శ్రీ వల్లభుల స్మరణ చేస్తోంది. ఎప్పుడైతే ఆ స్వామివారు ఎవరు లేరనే ధీమాతో వచ్చి ఇక్కడ నువ్వు ఎంత అల్లరి చేసినా ఎవరు నీ సహాయానికి రారు కాబట్టి మర్యాదగా నేను చెప్పిన మాట విను  అని ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. అదే సమయంలో ఆ గదిలో లైటు వెలిగి ఆ స్వామి వారికి అర్థం అయ్యే లోపలే పోలీసు వారు అతన్ని చుట్టు ముట్టి బందించివేశారు. అంతకుముందే వారు వచ్చి తమకు కావాల్సిన సాక్షాలన్నీ సేకరించారు. వారి అనుచరులని ముందే గుర్తు పట్టి బందించివేసి, వారిని ప్రశ్నించసాగారు.  ఇంతైనా కూడా ఆ స్వామివారి మత్తు ఇంకా దిగలేదు. సుమతి బయట ఉన్న తన తల్లిని కౌగిలించుకుని ఆ శ్రీ పాద శ్రీ వల్లభ స్వామిని స్మరించకుంటూ ఉన్నది.


ఈ విషయం తెలిసిన ప్రజలంతా, భక్తజనులంతా రావటం అక్కడ చేరిన ప్రజలందరికీ కూడా స్వామివారి అనుచరులు ఒక్కో క్కలు  స్వామివారి రహస్యాలు బయట పెట్టటం జరిగిపోయినాయి. సాయిబాబా భక్తునిగా చెప్పుకున్న ఆ జగతాప్ గారు చడీ చప్పుడు లేకుండా మాయమైపోయినాడు. ఆశ్రయం ఇచ్చినటువంటి శ్రీ  రంగారావుని విచారించగా  ఆయన ఏమీ తెలియని అమాయకుడని ఈ రంగబాబు రంగదాసు అనే ముఖ్య అనుచరుడు స్వామివారి కి లేనిపోని మహిమలు ఆపాదించటం వల్ల అతను తన ఇంటిని ఆ స్వామి వారి బస కింద ఇవ్వటానికి ఒప్పుకున్నాడని  తెలిసింది. ఈ కపట అవదూత గారిని సోదా చేసినప్పుడు పది లక్షల పైన రొక్కం, కొన్ని .కిలోల బంగారం, వెండి పోలీసు వారు పట్టుకున్నారు. చాలా గొడవ అయినాక స్వామి వారికి కర్ణాటక దేశంలో కూడా పెద్ద పెద్ద ఆస్థులున్నాయని కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయని ఎన్నో రకాల అక్రమాలు చేశాడని తెలియటంతో అతనికి పడవలసిన కారాగార శిక్ష పడింది. పోలీసు వారు ప్రజాలనందర్ని ఉద్దేశించి ఇటువంటి కపట అవదూతలని, స్వాములని మీరు నమ్మవద్దు అని, పరి పరి విధాల వల్లభదాసు గారిని ఎంతో మెచ్చుకొని ఆయన అక్కన్నించి వెళ్లిపోయారు. అక్కడ ప్రజలందరూ కూడా  వల్లభదాసు గారిని చుట్టుముట్టి ఎంతో మెచ్చుకొన్నారు. సుమతి తల్లిదండ్రులు కూడా అభినందించారు.


అయితే వల్లభదాసు నిర్లిప్తంగా శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి ఇచ్చిన ప్రేరణ తొనే ఈ పనులు చేయగలిగానని తాను నిమిత్తమాత్రుణ్ణి అని ఏమి జరగనట్టుగానే ఆయన మాట్లాడారు. శ్రీ పాద శ్రీ వల్లభ స్వామిని లేదా దత్తాత్రేయ స్వామిని పట్టుకున్నప్పుడు ఇటువంటి మధ్యవర్తుల దగ్గరికి వెళ్లకూడదని సాక్షాత్తూ శ్రీ సాయి సచ్చరిత్ర లో కూడా నీకు నాకు మధ్యలో ఈ అడ్డుగోడలు ఎందుకని సాయి చెప్పినట్టు మరియు శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం అనేక ఘట్టాలని ఆయన వివరిస్తూ అవదూత అనే పదానికి నిర్వచనం అంతా పోయిందని అవదూత అంటే పెంట కుప్పలపై బీడీ చుట్ట సిగరెట్లు ఏరుకొని మురుగు కాలువలో నీళ్లు తాగుతూ బండ బూతులు తిడుతూ జుట్టంతా చింపిరిగా ఉండి చినిగిపోయిన బట్టలతో స్నానం లేకుండా ఉండేవాడు తనలో తాను గొణుక్కుంటూ ఉండేవాడు అని ఈ కలియుగంలో అవదూతలకి నిర్వచనం ఇవ్వబడింది కానీ నిజానికిశ్రీ దత్త పురాణంలో సరె దత్త స్వామి వారునేను అవదూతను అని చెప్పుకోవడం జరగలేదు. అవదూత అంటే కేవలము శ్రీ దత్త స్వాముల వారే తప్ప ఇంకా ఎవరు కాదని, కేవలం దత్త స్వామి ఆశీర్వాదంతో  శ్రీ పాద శ్రీ వల్లభుల ఆశీర్వాదంతో మాత్రమే అనన్య భక్తి భావంతో ఉన్న వ్యక్తికి వెంకయ్య స్వామిగా అవదూత తత్వంతో ఉంటావని చెప్పటం తప్పితే , శ్రీ స్వామివారిని మించిన అవదూత రెండోవాడు లేడని, మీరు ఎప్పుడూ మూలాన్నే పట్టుకొని ఉండాలని మాయలు,మర్మాలు, గోసాయి చిటికెలు చేసేవారి దగ్గరికి కనీసం వెళ్ళను కూడా వెళ్లకూడదని , ఎంతో వినయంగా నమ్రతగా అక్కడికి వచ్చిన జనాన్ని అందర్నీ సంబోదిస్తూ చాలా చక్కగా చెప్పటం జరిగింది. అక్కడికి వచ్చిన వారందరు కూడా వల్లభదాసుకి, శ్రీ పాద శ్రీ వల్లభులకి జయ జయ ధ్వనులు పలుకుతూ తాము చేసిన తప్పుకి లెంపలు వేసుకొని, ఇంటికి వెళ్లి ఆ కపట అవదూత ఛాయా చిత్రాలసు అవతల పారవేసి కేవలం ముందు ఇక దత్తస్వామి అవతారాలు మాత్రమే పట్టుకుంటామని ఎంతో భక్తి భావంతో ప్రతిజ్ఞ చేశారు. ఇదంతా గమనిస్తున్న నాగనాథునికి శ్రీ వల్లభ దాసు చేసిన మంచి పనికి ఎంతో సంతోషించారు. అప్పటినుంచి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో నేను దత్త భక్తున్ని, అవదూతని అని చెప్పుకునేవారు దరిదాపుల్లో రాలేదు. అంతేకాదు చాలామంది దత్త భక్తులుగా, శ్రీ పాద భక్తులుగా మారిపోవటం జరిగింది.

దేవదత్తుని వృత్తాంతం - 13

దేవదత్తుని వృత్తాంతం - 13



ఇదంతా చూస్తున్న నాగనాథునికి ఈ కొత్త శిరిడి సాయి బాబా భక్తుని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది.  వెంటనే అతను ఆయన్ను ఆయన జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలని సంకల్పించ గానే ఆయనకు మనోనేత్రము ముందు చాలా స్పష్టంగా ఆయనను గురించిన విషయాలు  తెలిశాయి. అతని పేరు జగతాప్ అని భారత ప్రభుత్వం లో ఆర్మిలో కొంతకాలం పని చేసి రిటైర్ అయ్యారని పరమ శిరిడి బాబా భక్తుడని, ఆయనకు సాక్షాత్తు శిరిడీ సాయి బాబా సంస్థానం లో రాచ మర్యాదలతో అసలు సమాధి అంటే ప్రస్తుత సమాధి కింద ఉన్న మరొక సమాధి ఉంటుంది. అదే సాయి బాబా గారి అసలు సమాధి. ఆయనను అక్కడి దాకా ప్రవేశం నిరాటంకం గా ఉంటుంది అని తెలిసింది. అతను శిరిడీ కి ఎప్పుడు వెళ్లినా శ్రీ సాయిబాబాకు పెట్టిన పదార్థాలన్నింటిని ఆయనకు మరియు అతని అనుచరులకు వడ్డిస్తారని తెలిసింది. ఆయన చేతిలో అద్భుతమైన వ్యాధి నివారణ శక్తి ఉందని ప్రచారం జరిగింది. అనేకమంది ధనవంతులతో అతనికి పరిచయాలు ఉన్నాయని తెలిసింది. అయితే ఎవరైనా అతన్ని  వారి గ్రామాలకు, పట్టణాలకు గాని పిలిపించుకోవాలంటే ఆయన విమానంలో రాను పోను ప్రయాణ ఖర్చులు భరించాలి. ఖరీదైన హోటల్లో ఆయనకు బస.  24 గంటలు ఆయన ఉన్నంత వరకు కారు కేటాయించబడాలి అని ఆయనకి తెలుస్తూ ఉన్నాయి.  మరి ఆయన మహారాష్ట్ర వాసి అని గ్రహించారు. మరునాడు పెద్ద గుడారాలు వేయటం జరిగింది. అయితే ఇక్కడ ఎటువంటి రుసుము స్వీకరించబడలేదు కానీ మన ఆచారం ప్రకారం అక్కడకి వచ్చిన  రోగులందరు ఎంతో కొంత దక్షిణ, కొన్ని పలహారాలు ఇవి సమర్పించటానికి వచ్చారు. అంతక్రితం రోజు దత్త యజ్ఞం చేసిన ఒక వ్యక్తికి మెడ బాగం దగ్గర ఎముకలు అరిగి బాధ పడుతున్నాడని ముందుగా ఆయన్ని రమ్మని చెప్పి విభూతి తీసుకొని ఆయన నుదిటిపై పెట్టి ఆయన మెడ అంత రాస్తూ శ్రీ సాయి నాథుని పేరు 11 సార్లు ఆయనతో చెప్పించసాగారు.



ప్రతి రెండు నిమిషాలకు మీకు తగ్గిందా మీకు తగ్గిందా తగ్గిపోయిందా అని  అనటంతో అంతకుముందే చాలా పెద్ద మొత్తంలో దక్షిణ సమర్పించటంతో చాలా మోహమాటనికి తగ్గింది అని చెప్పటం నాగనాథునికి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ వ్యక్తి యొక్క శ్రీమతి భర్త చెప్పింది నమ్మింది. ఆమె కూడా తనకి కింది భాగంలో చాలా బాధగా ఉందని చెప్పటంతో ఆయన ఒక్క క్షణం కూడా సందేహించకుండా వేల మంది చూస్తుండగా తన చేతిని ఆమె చీర లోపలి భాగం నుంచి పైకి వెళ్లి ఆమె తొడలను స్పర్శిస్థూ  ఆమె నడుము నొక్కుతూ శ్రీ సాయి నాథుని పేరు 11 సార్లు చెప్తూ విభూతి రాస్తూ మీకు తగ్గిందా తగ్గిందా అని అనడంతో ఆమె నిర్గాంతపోయింది. అంతమంది జనం ముందు ఈ విధంగా సాహస కృత్యం చేస్తాడని ఆమె ఏనాడు ఊహించలేదు. ఆమె గాబరా పడిపోయి తగ్గలేదు అంటే ఆ చేయిని ఇంకా ఎక్కడికి తీసుకువెళ్తాడో అని తగ్గింది తగ్గింది చెప్పటం, అతను మెల్లగా చేయి తీసేయటం జరిగే సరికి అక్కడ వల్లభదాసుకి, అతని అనుచరులకి భాద కలిగింది, కోపం కూడా వచ్చింది. ఇంకా అతన్ని లోతుగా పరిశీలిస్తే నాగనాథునికి అతను శిరిడి సాయిబాబా పరమ భక్తుడైన శివనేషన్ స్వామి ఒక తమిళుడు . శిరిడీ లో ఉన్న ఊరు స్థానం ఎదురుగా మెట్లదారికింద ఉన్న చిన్న గదిలో ఉంటూ బాబా గారిని గురించి కొన్ని ఏళ్లు ధ్యానము చేస్తున్న మహాత్ముడు. ఆయన పరమపదించాక శిరిడిలొనే ఒక చోట సమాధి చేసి అక్కడే ఒక ఆశ్రమం ఏర్పరచటం జరిగింది. అక్కడ శిరిడ సాయి బాబా తెలుగు చరిత్రను అనువదించి, ఎన్నో దత్త యజ్ఞాలు చేసిన  సాధకుడు దత్త యజ్ఞం చేస్తున్నప్పుడు కూడా ఆ బ్రాహ్మణుని భార్యతో ఇదే విదంగా ప్రవర్తించడం తో ఆమె సిగ్గుతో చితికిపోయింది.



ఇలా జగతాప్ గారు చేసిన చికిత్స లో చాలా మందికి  గుణం కనిపించలేదని , ఒక వేళ గుణం కనిపించకపోతే మీ ప్రారబ్ద కర్మ బలంగా ఉందని సాకుతో తప్పించుకొనేవాడు. ఇవన్నీ నాగనాథుని మనో నేత్రం ముందు ఒక చలన చిత్రం లాగా కన్పించసాగాయి. ఒకవేళ చిన్న చితక వ్యాధులు తగ్గే అవకాశం ఉన్న ఇదంతా ఆ జరిగిన అద్బుతాలని జగతాప్ గారికి ఆపాదించటం, బాబాని స్మరించకపోవటం చూసి కూడా ఆయన కొంతగా బాధ పడ్డాడు. ఈ ప్రారబ్ద కర్మ సిద్ధాంతం జనాలు ఎంతగా అపార్థం చేసుకుంటున్నారు. పండితులు కూడా విపరీతమైనటువంటి అసంబద్దమైనటువంటి  తర్కానికి అందనంతగా దత్త బోధనలకు వ్యతిరేకంగా పలు భాష్యాలు చెప్పటం కూడా ఆయనకు కించిత్తు భాద కలిగించింది. జనులు ముఖ్యంగా పండితులు పామరులు  కూడా ఎంతో అజ్ఞానంలో ఉన్నారు. సాక్షాత్తు దత్తుని నమ్ముకున్నవారు కూడా ఇటువంటి మధ్యవర్తుల ఛాయా చిత్రాలను పూజ మందిరంలో పెట్టుకోవటం వాళ్ళను ప్రార్థించటం, గది నిండా ఇటువంటి సాధువులు ఉండటం మధ్యలో శ్రీ పాద స్వామి మరియు దత్తాత్రేయుల వారి పటం ఉండటం చూసి ఆయన జనం ఎంతగా దత్తాత్రేయ తత్వానికి దూరంగా ఉన్నారా అని కూడా అనుకున్నారు. వల్లభ దాసు కూడా తన అనుచరులను ఆయన దగ్గరికి పంపటం, వారందరు వచ్చి జరుగుతున్న మోసాన్ని చెప్పటం ఈయన గ్రహించారు. అదే సమయంలో ఎంతో మంది మహిళలు వచ్చి జరుగుతున్న తతంగాన్ని ఫోటోల రూపంలో చిత్రీకరించడం అది ప్రతివాళ్ళు కూడా ఏదో మాములు విషయాన్ని గ్రహించినట్టుగా ఉన్నారు.



ఈలోగా ఆ స్వామి వారు సుమతి తండ్రికి కబురు చేసి ఏమయ్యా ఐదు రోజులు అయిపోయింది మరి ఎప్పుడు పంపిస్తావు వ్యాధి ముదిరితే కష్టం కదా అని చెప్పటంతో స్వామి నేను ఈ రాత్రి తీసుకొస్తాను అని చెప్పటం జరిగింది. సుమతి తండ్రి ఇంటికి వచ్చి రాధమ్మకి, సుమతికి కూడా చెప్పి స్వామి వారు రాత్రి తీసుకురమ్మన్నారు కాబట్టి మనం వెళ్దాం తప్పకుండా మన సుమతికి తెలియనటువంటి అంతులేని వ్యాధి తగ్గిపోతుందని నాకు నమ్మకం ఉందని పదే పదే చెప్పటం జరిగింది. అయితే రాధమ్మకి సుమతికి కూడా చాలా దైర్యం కలిగింది. శ్రీపాద స్వామి తమని తప్పకుండా కాపాడతాడానే ఒక గట్టి విశ్వాసం వారికి కలిగింది. ఆ ధైర్యంతోనే వారు రాత్రి తొమ్మిది గంటల తర్వాత వారి నివాస స్థానానికి వెళ్ళటం జరిగింది .

దేవదత్తుని వృత్తాంతం - 12

దేవదత్తుని వృత్తాంతం - 12

స్వామి వారు ప్రత్యేకంగా ఒక గదిలో ఉండి అందరికి ప్రత్యేక దర్శనం ఇస్తున్నారు. ఆయన తాగుతున్నటువంటి చుట్ట, సిగరెట్, బీడీ నుంచి వచ్చినటువంటి అమూల్యమైన నుసిని ప్రజలంతా భక్తి, శ్రద్దలతో పోగు చేసుకుంటున్నారు. దానికి తోడు అక్కడ ఉన్న ఒక ముఖ్య అనుచరుడు ఒక దారపు పోగు చేతికి కనక కంకణంగా కట్టుకుంటే ఎన్నో జబ్బులు పోతాయని, లక్ష్మీ కటాక్షం లబిస్తుందని చెప్పటంతో అక్కడ కూడా జనం విపరీతంగా గుమి గూడారు.  ఒక్కొక్క పసుపు పచ్చ దారపు కంకణానికి 50 రూపాయలు వసూలు చేయడం , సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, దరిద్రంలో ఉన్నవారికి డబ్బు వస్తుందని చెప్పటంతో అక్కడ కూడా ఎంతో ఒత్తిడి జరిగింది. అక్కడ భక్తుల ఇళ్ళలో శ్రీపాద శ్రీ వల్లభ మరియు శ్రీ దత్త స్వామి వారి ఛాయా చిత్రాలు ఉండేవి. వాటి పక్కనే ఈ కొత్తగా   వచ్చిన స్వామి వారి పెద్ద ఫొటోలు ల్యామినేట్ చేయబడి ఒక్కొక్కటి రెండు వందల రూపాయల చొప్పున విక్రయింపబడుతున్నాయి. అవి కూడా శ్రీపాద శ్రీ వల్లభ మరియు శ్రీ దత్త స్వామి ఫోటోల కంటే నాలుగు రెట్లు పెద్ద సైజులో ఉండటం , పెద్ద పోస్టర్ కు వేయి రూపాయల ధనం వసూలు చేయటం జరిగింది. ఇదంతా గమనిస్తున్న నాగనాథునికి పరి పరి విధాల ఆలోచనలు వస్తున్నాయి. మరి ఈ కలియుగంలో కలి కూడా అంత దుర్మార్గుడిగా ఉండడు కదా. ఇప్పుడు ఏం జరగబోతుంది ఈ వల్లభ దాసు ఏం చేస్తాడు అని ఆసక్తిగా గమనిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని వేలమంది అక్కడ భోజనాలు చేసి ఆరోజు రాత్రి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడికి శిరిడి సాయి బాబా గారి పరమ భక్తుడు వేంచేస్తున్నాడని అతను కూడా ఎటువంటి వ్యాధులనైనా క్షణంలో తీసివేస్తాడాని ప్రచారం జరిగింది. ఆసక్తి ఉన్నవాళ్లు ఉదయం 8 గంటల నుంచి సమావేశం కావాలని చెప్పటం జరిగింది. దీంతో వల్లభదాసుకి వీళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడ్డారు అని నిశ్చయం దృఢం కాసాగింది. సరే అది కూడా ఏం జరుగుతుందో చూద్దామని తన సహచరులతో ఇంటికి  వెళ్ళటం జరిగింది.

3 September 2017

చేదు నిజాలు: Episode 6

చేదు నిజాలు
episode-6

రాజీవ్ దీక్షిత్  - మన్మోహన్ సింగ్ తో భేటీ 

      నాకు ఒకసారి  పూర్వ ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారితో మూడు గంటలు చర్చలు జరిపే అవకాశం దొరికింది. మహారాష్ట్ర లోని సేవక్ రాం అనే ఒక చిన్న గ్రామంలో గాంధీ గారు నిర్మించిన ఒక చిన్న ఆశ్రమంలో నేను ఉంటూండగా మన్మోహన్ సింగ్ అక్కడకి వచ్చారు. ఆయన అక్కడకి ఎందుకు వచ్చారంటే సేవక్ రాం గ్రామం పక్కన ఉండేటువంటి వ్యవసాయం చేసుకునే రైతులు 56,000 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సందర్భంగా ఆయన ఒక మూడు గంటలు అక్కడ ఆగినప్పుడు నేను ఆయనని కలవడం జరిగింది. అప్పుడు అక్కడ జనం అడుగుతున్నటువంటి ప్రశ్నలకి ఆయన తలక్రిందులైపోయినారు. నేను ఆయనని మొట్టమొదటిసారిగా ఒక ప్రశ్న అడిగాను. మీరు ఎంతో ప్రముఖమైన ఆర్ధిక శాస్త్రవేత్త కదా!విదేశీయులు కూడా మిమ్మల్ని గొప్ప ఆర్థికవేత్త అని ఎంతో పొగుడుతూ ఉంటారు. కానీ నాకు అర్ధంకాని విషయం మీరు డాలర్ ధరని పెంచారు మరియు రూపాయి విలువను తగ్గించారు. మీరు ఆర్ధికమంత్రి అయ్యాక ఒక్కరోజులోనే  చాలా శాతం రూపాయి యొక్క విలువని తగ్గించి, అమెరికన్ డాలర్ విలువని పెంచారు. మరికొద్ది రోజులకే మళ్ళీ చాలా శాతం రూపాయి విలువను మీరు తగ్గించి డాలర్ విలువను పెంచారు కదా!మీరు ప్రధానమంత్రి అయ్యాక కూడా ఇదే విధానం కొనసాగుతోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? తన స్వంత దేశం యొక్క ద్రవ్యపు విలువను తగ్గించుకుంటూ డాలర్ విలువను పెంచడం భావ్యం కాదు కదా!ఇదెలా సాధ్యం?      


       ఈవిధంగా మీరు చేసినందువల్ల మన దేశానికి చాలా నష్టం జరుగుతోంది కదా?అని నేను ప్రశ్నించగా, ఆయన నన్ను తిరిగి బదులు ప్రశ్నించారు "ఏవిధంగా నష్టం జరిగింది అని"? నేను ఆయనతో రెండు విషయాలు చెప్పాను,మళ్ళీ అవే విషయాలు ఇక్కడ మీకు చెప్తున్నాను. మొదటి ఉదాహరణ మన్మోహన్ సింగ్ గారు ఆర్ధికమంత్రిగా  పనిచేసిన రోజుల్లో భారతదేశం అమెరికాకి లోహాన్ని ఒక కిలో 7 రూ/- చొప్పున అమ్ముతూండేది. మన్మోహన్ సింగ్ ఆ సమయంలో రూపాయి రేటుని తగ్గించడం వల్ల కిలో లోహం విలువ 15 పైసలకు పడిపోయింది. దీనివల్ల ఎంత నష్టం వచ్చిందో సామాన్య భారతీయిడిని అడిగినా వాడు చెప్పగలుగుతాడు. అంటే ప్రతీ ఒక్క  కిలో ఇనుప ఖనిజానికి మనకి 6.85 రూ/- నష్టం వచ్చింది. మొత్తంగా 13 వేల కోట్ల రూపాయల నష్టం ఈయన చేసిన తప్పిదం వలన మనకు కలిగింది. ఈవిధంగా 15 ఏళ్ళకి కనుక లెక్క కడితే మనకు కలిగిన నష్టం భారీ మొత్తంలోనే ఉంటుంది కదా? ఇంత భారీ మొత్తంలో వచ్చిన నష్టం కనుక  నివారించగలిగితే మనం ఆ డబ్బుతో పంజాబ్ లోని ప్రతీ గ్రామానికి బంగారంతో రహదారులు నిర్మించుకోగలం. మరి ఎందుకు ఈవిధంగా మీరు చేశారు అని నేను ఆయనని ప్రశ్నించినపుడు ఆయన ఈవిధంగా బదులు చెప్పారు. "ఏమిచెయ్యాలి? భారతదేశం అమెరికా, IMF, వరల్డ్ బ్యాంకు మరియు ఇంకా అనేక విదేశీ సంస్థల నుంచి అప్పు తీసుకుంది. అమెరికా వారి షరతుల ప్రకారం రూపాయి ధరని తగ్గించవలసివచ్చింది అని."  మరలా నేను ఆయనని ఈవిధంగా ప్రశ్నించాను "అప్పు తీసుకునేటప్పుడు వాళ్ళ షరతుల ప్రకారం మీరు రూపాయి విలువను తగ్గించారు. దాని వలన మన దేశానికి ఎంతో నష్టం జరిగింది. 

      మరి మీరు దేశభక్తుడిని అని ఎందుకు చెప్పుకుంటున్నారు? వాళ్ళు ఏది చెయ్యమంటే అది చేస్తే, దేశానికి నష్టం కలిగితే, అది మీ దేశ భక్తి ఎలా అవుతుంది? వాళ్ళు రూపాయి విలువని తగ్గించమని షరతు పెట్టినప్పుడు  నేను తగ్గించను అని మీరు ఖచ్చితంగా చెబితే మీరు నిజమైన దేశభక్తులు అయ్యుండేవారు. వాళ్ళు ఎదో చెబుతున్నారు మీరు వాళ్ళు చెప్పిందంతా చేస్తున్నారు. నేను మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెబుతాను. పంజాబ్ లో మనం మంచి నాణ్యత గల  చక్కెర  కిలో 20/- కి అమ్ముతుంటాం. ఇదే చక్కెరని మనం అమెరికాకు ఒక కిలో 50 పైసల చొప్పున ఎగుమతి చేస్తున్నాం. అలాగే పంజాబ్ లో బాస్మతి బియ్యం బాగా పండిస్తారు. ఈ బియ్యం ధర మన దేశంలో కిలో 86/- ఉంది. మరి ఇదే బాస్మతి బియ్యాన్ని కిలో 1/- కే మనం అమెరికాకు ఎగుమతి చేస్తున్నాం. అంటే డాలర్ రేట్ తో పోలిస్తే ఎంత నష్టం వస్తోందో చూడండి! అలాగే 60 నుండి 70 రూపాయలు  ధర ఉన్న మినపప్పుని మనం కిలో 2/- చొప్పున ఎగుమతి చేస్తున్నాం. ఈవిధంగా మీరు ఏ వస్తువుని చూసినా  కూడా అమెరికాకు ఎగుమతి చేస్తున్నప్పుడు మన దేశానికి తీవ్ర నష్టం వస్తోంది. భారతీయులు ఎక్కువ ధర పెట్టి కొనుక్కుంటారు, అదే అమెరికన్లకు అయితే మనం చాలా  తక్కువ ధరకే  అమ్ముతున్నాం. మంచి నాణ్యత గల జీడిపప్పు, ద్రాక్ష ఇంకా అనేక రకమైన ఉత్పాదనలను అమెరికాకు 45 రెట్లు తక్కువ ధరకి అమ్ముతూంటాం. మీరు దేశానికి ప్రధాని మరియు గొప్ప ఆర్థికవేత్త అయ్యుండి దేశానికి తీవ్ర నష్టం కలిగే ఈ విధానాలను ఎందుకు అమలు చేస్తున్నారు? ఇంతకీ మీరు భారతదేశానికి ప్రధానియా? లేక అమెరికాకు ప్రధానియా? అని నేను చాలా ధైర్యంగానే ఆయన్ను ప్రశ్నించాను. దానికి మన్మోహన్ సింగ్ గారికి కొంచెం కోపం వచ్చింది కానీ ఆయన మేము ఏమీ చెయ్యలేమనే సమాధానాన్నే మళ్ళీ చెప్పారు. అందరి దగ్గరా అప్పులు తీసుకున్నాం కాబట్టి వాళ్లు చెప్పినట్టే నేను చేయాల్సివచ్చింది అని చెప్పారు. భారతదేశంలో పండే పంటలన్నీ భారతీయులకి అందని ధరలలో ఉన్నాయి వాళ్ళు కొనుక్కోవడానికి ఎంతో సతమతమవుతున్నారు. మరి అవే  పంటలు మరియు ధాన్యాలని మీరు దాదాపు ఉచితంగానే అమెరికాకు సరఫరా చేస్తున్నారు. ఇదేవిధంగా మనం వజ్రాలు, బంగారం మొదలైన ఆభరణాలని కూడా అమెరికాకు ఎగుమతి చేస్తూంటాం. మొత్తం  ఎగుమతి యొక్క విలువ 50 లక్షల కోట్లు అని అనుకుంటే దాని యొక్క అసలైన ధర అంతర్జాతీయ మార్కెట్లో 25 వేల లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది.ఎందుకు ఈవిధంగా చేయవలసివస్తోంది? దానికి ఒకే ఒక్క కారణం డాలర్ రేట్ ను పెంచి రూపాయి ధరను తగ్గించడం. 

     ఇందుమూలంగానే ఇవన్నీ జరుగుతున్నాయి.నేను అడిగే ప్రశ్నల పరంపరకి,మరియు చెబుతున్నలెక్కల వివరాలు అన్నీ విన్నాకా ప్రధానికి ఏమి చెప్పాలో అర్ధంకాక నిరుత్తరుడైపోయాడు. వెంటనే ఆయన రాజీవ్ దీక్షిత్ గారూ,"మీరు పార్లమెంట్ కు వచ్చి నా కుర్చీలో కూర్చున్నట్లయితే నేను చేసినట్టుగానే మీరూ చెయ్యక తప్పదు"అని నాతో చెప్పారు. ఇలాంటి పరిస్థితి వస్తుందనుకుంటే నేను ఆ ప్రధాని పదవిని అసలు కోరుకోను. దేశానికి ఇంత నష్టం వాటిల్లే పనులు నేను చెయ్యలేను. నిజానికి మీరు ప్రజలకి వాస్తవాలను ఎందుకు చెప్పటంలేదు? ఎందుకు ప్రజలందరినీ మభ్యపెడుతూ ఇంత అఘాతంలోకి తోసివేస్తున్నారు? మీరు ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు   ప్రజలందరికీ globalization, liberization అని పెద్దపెద్ద మాటలు చెప్తారు. కానీ మీరు చేస్తున్నది మాత్రం americanization. సరే ఇటువంటి విషయాలు సామాన్యమైనటువంటి ప్రజలకు ఎలాగూ తెలియదు, నాయకులూ ఏమీ చెప్పరు. కానీ నాలాగ కాస్త చదువుకున్నవాడు, కొంత విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కూడా ఏమి చేస్తున్నారంటే ఎంతసేపూ ఆ టీవీ లో వచ్చేటటువంటి కార్యక్రమాలు చూడటం, క్రికెట్ మ్యాచ్లు చూడటం, ఇతరత్రా వినోద కాలక్షేపాలు చేస్తున్నారే తప్ప అసలు మన భారతదేశం ఎక్కడికి వెళ్తోంది, ఏమవుతోంది అని మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదు. నాలాంటి యువకులకి నేనెప్పుడూ సలహా ఇస్తుంటాను, మీరు నాలాగా గ్రామగ్రామానికి వెళ్లి ప్రజలని చైతన్యవంతం చెయ్యండి అని. కావున మీరు చేస్తున్నది ప్రపంచీకరణ(globalization) కాదు, బానిసత్వాన్ని వ్యాప్తి చెయ్యడం మాత్రమే. 


                     ఈవిధంగా ప్రపంచ బ్యాంకులు, మరియు అమెరికా లాంటి దేశాలు ఒక చేత్తో అప్పు ఇచ్చి మరొక  చేతులతో ఆ దేశాల యొక్క జాతీయ సంపదను అంతా దోచుకుంటున్నాయి. భారతదేశం మాత్రమే కాదు ఇథియోపియా, సోమాలియా లాంటి ఎన్నో దేశాలు ఇలా దోచుకోబడుతున్నాయి. రాజకీయ నాయకులు మాత్రం చాలా గొప్పగా ప్రపంచ బ్యాంకు నుండి అప్పుతీసుకున్నామని ప్రజలకి  చెబుతారు. అడుక్కుతెచ్చుకుంటున్నాం అని చెప్పుకోవడానికి సిగ్గు, అభిమానం కొంచమైనా లేదు మన నాయకులకి. దీనినే పత్రికల వాళ్ళు మరియి టీవీ వాళ్ళు చాలా పాసిటివ్ గా చూపిస్తుంటారు. కావున మన నాయకులు దేశానికి నష్టం కలిగించే ఇటువంటి పనులని మానుకుంటే మన దేశం త్వరలోనే సంపన్న దేశంగా ఎదగగలదు. ప్రియమైన పాఠకులారా మీరు ఇప్పటికైనా మేల్కొనండి. ఈ చేదు నిజాలను తోటి భారతీయులతో పంచుకోండి. కనీసం మీరు చెప్పిన పదిమందిలో ఒక్కరు మారినా కూడా దాని ప్రభావం ఎంతో మంచిగా ఉంటుందని ఆశిస్తున్నాం.  

1 September 2017

చేదు నిజాలు: Episode 5

చేదు నిజాలు
Episode5


నేను ఒకసారి కాన్పూర్ వెళ్ళినప్పుడు అక్కడ భారతీయ స్వాభిమాన్ సభకి వెళ్లడం జరిగింది. కాన్పూర్ స్టేషన్ లో దిగి ప్లాటుఫారం క్రాసింగ్ వంతెన దాటి వస్తున్నప్పుడు ఆ ప్రక్కనే ఒక చిన్న టీ దుకాణం ఉంది, అక్కడ ఒక తల్లి మరియు ఆమె పిల్లలు కొడుకు, కూతురు కూర్చొని ఉన్నారు. ఆ చిన్న అమ్మాయి తల్లిని, అమ్మా!"మనమెందుకు పేదవాళ్లుగా ఉన్నాము?" అని ప్రశ్నించడం విని నేను ఒక్క క్షణం ఆగిపోయాను. ఇలా ఈ ప్రశ్న అడుగుతున్న ఆ పాప, ఆ కుటుంబం సామాన్యులు కారు అని నాకు ఎందుకో అనిపించింది. సరే! వెళ్లి కనుక్కుందాం వారిగురించి అనే కుతూహలంతో నేను వెళ్ళాను. మీరు ఎవరు? ఏం చేస్తున్నారిక్కడ? అని అడగ్గా వాళ్ళు చెప్పిన సమాధానం విన్నాక నేను దిగ్భ్రాంతి చెందాను. మేమంతా తాంతియాతోపే పరివారం వాళ్ళం అని వాళ్ళు చెప్పారు. ఇక్కడ రాజీవ్ దీక్షిత్ గారు ఉపన్యాసం కొనసాగించడానికి కొంత సమయం పట్టింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, గొంతు గద్గదమైపోయింది. మన భారతదేశంలో తాంతియాతోపే వంటి దేశభక్తుని యొక్క పరివారం ఆఖరికి టీ దుకాణం పెట్టుకుని బ్రతకవలసివస్తోంది. తాంతియాతోపే కి విరుద్ధంగా పనిచేసినటువంటి దేశద్రోహులకి ఈ భారతదేశంలో సింహాసనాలు దక్కాయి, రాజభోగాలు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఏ వ్యక్తులైతే తాంతియాతోపేను  వెన్నుపోటు  పొడిచి, విద్రోహచర్యలు గావించి అతనిని హత్య చేశారో  ఆ విద్రోహులలో ఇద్దరు  భారతదేశంలో  ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. మీకు తెలుసా ఈ నిజాలు? ఏ దేశ ద్రోహులైతే తాంతియాతోపే యొక్క రహస్య స్థావరాన్ని ఆంగ్లేయులకు తెలిపారో అటువంటి వంశస్థులు ఈ భారతదేశంలో చాలా ఉన్నత పదవులలో ఉన్నారు. ఏ దేశ ద్రోహులైతే ఝాన్సీ లక్ష్మీబాయి వంటి దేశ భక్తురాలిని, ధైర్యవంతురాలిని కుట్ర పన్ని చంపించారో వారు ఈ దేశంలో ఉన్నత పదవులని  అలంకరించారు. ఈ దేశం కోసం తన సర్వస్వాన్ని అర్పించిన  దేశ భక్తుడైన తాంతియాతోపే యొక్క పరివారం మాత్రం టీ దుకాణం పెట్టుకొని చాలా దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు.ఇటువంటిది మన భారతదేశం. ఇటువంటి దుర్మార్గాలని మనం ఎందుకు సహించాలి?సహించవలసిన అవసరం లేదు అని నేను భావిస్తున్నాను. దేశం కోసం ప్రాణాలను అర్పించిన ఎంతోమంది దేశ భక్తులు భారతదేశం ఈ విధంగా తయారవుతుందని వారెప్పుడూ అనుకోలేదు. వారి యొక్క కల్పన వేరేవిధంగా ఉండేది.తాంతియాతోపే, ఝాన్సీ కి రాణి లక్ష్మీబాయి, చంద్రశేఖర్ లాంటి దేశ భక్తులు కలలో కూడా భారతదేశం స్వాతంత్య్రం తరవాత ఇలాగ ఉంటుందని బహుశా ఉహించి ఉండనే ఉండరు. వారు ఎంత దేశ భక్తులో చంద్రశేఖర్ ఆజాద్ జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటనని నేను మీకు వివరిస్తాను. చంద్రశేఖర్ చాలా  బీద కుటుంబంలో పుట్టాడు వాళ్ళ ఇంట్లో తినడానికి తిండి కూడా సరిగా ఉండేది కాదు. అతడు 13 ఏళ్ల వయసులోనే ఇంట్లోంచి పారిపోయి బెనారస్ చేరాడు. అక్కడ విప్లవకారుల సంఘంలో అతడు చేరిపోయాడు. అక్కడే విప్లవకారులతో పాటు కాకోరికాన్డ్ లో వారు ఖజానాని కొల్లగొట్టడం జరిగింది. దాని వాల్ల  వారికి  కొంత డబ్బులు సమకూరాయి. ఈ విషయం తెలుసుకున్న చంద్రశేఖర్ తల్లితండ్రులు అతనికి ఒక ఉత్తరం రాశారు.  "నీ దగ్గర ఉన్న డబ్బులలో కొంత మాకు ఇస్తే మా దారిద్య్రం కొంత తీరుతుంది కదా!" అని దాని సారాంశం.  అప్పుడు చంద్రశేఖర్ స్వయంగా తన తల్లితండ్రులను కలవడానికి ఇంటికి వెళ్ళాడు. అతడు తల్లితండ్రులతో ఈవిధంగా అన్నాడు "నా దగ్గర ఉన్న డబ్బుని నేను మీకు ఇవ్వలేను అది దేశానికి సంబంధించినది. అయితే ఒక విషయం! నా దగ్గర ఒక రివాల్వర్ ఉంది దానిలో రెండు బుల్లెట్లు ఉన్నాయి అది మాత్రం నేను మీకు ఇవ్వగలను అని చెప్పాడు." ఇటువంటి దేశ భక్తులకి జన్మ ఇచ్చినటువంటిది భారతదేశం. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి?మనం ఇంకొక రకమైన యుద్ధం చేయవలసి ఉంటుంది. ఒక యుద్ధాన్ని ఝాన్సీ కి రాణి లక్ష్మీబాయి, తాంతియాతోపే మరియు చంద్రశేఖర్ ఆజాద్ వంటి వారు చేశారు. అలాగే మనం కూడా ఇప్పుడు ఒక యుద్ధాన్ని చేయక తప్పదు. మేము భారతీయ స్వాభిమాన్ రక్షించే ఉద్యమంగా ఒక యుద్ధాన్ని ప్రారంభిస్తున్నాం.