Digambara Digambara Sripada Vallabha Digambara ..... Digambara Digambara Sri Dattatreya Digambara

More ...

For Soundarya Lahari Audio, Spiritual Soup, Info on Spiritual Masters, Game of Life, Random Thoughts and more... visit our websites - SriDatta.info and SreeDatta.guru

Please email your feed back to sridatta50@gmail.com Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Are you liking audio stories?

18 January 2016

Daivika Shaktulu - Asura Shaktulu - Episode 3

సరోజగారి వృత్తాంతం రాజా ఆంజనేయ ప్రసాద్ గారికి స్వయంగా చెప్పటం తన బాధ్యత అని భావించి మోహన్ ఒకరోజు మళ్ళా సైకిల్ తీసుకుని ఆ శాలిబండ పక్క సందులో ఉన్న ఆయన గృహానికి బయలుదేరాడు. పొద్దున్నే వెళ్ళగానే ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించారు. యధాప్రకారం రెండు కప్పుల టీ ఆర్డర్ చేసారు. వారి ఇంట్లో అందరికీ మోహన్ పరిచయం అయ్యాడు. అలా టీ తాగుతూ మాట్లాడుకుంటూండగా  రాజావారు ఆయన గురించి కొన్ని వివరాలు చెప్పారు. 

తనకు విద్య నేర్పినవారు ఆయన పెదనాన్నగారని, ఆయనకి సంతానం లేకపోవటంతో తనని దత్తత తీసుకుని ఈ కాళిక అమ్మవారి ఉపాసనా విధానలన్నీ నేర్పించారని, అయితే జీవితంలో ఈ ఉపాసన చేస్తున్నవారు కేవలం మంచి పనులు మాత్రమే చెయ్యాలని, ప్రజలు క్షుద్రశక్తులకి బలి అయినప్పుడు, వాటి ద్వారా బాధింపబడుతున్నప్పుడు వాటి నివారణ మాత్రమే చేయాలని, ఆయన తండ్రిగారు ఆదేశించారని, అప్పట్నించి ఆయన ఇదే వృత్తిలో ఉన్నానని ఎంతో నిరాడంబరంగా ఆయన చెప్పారు. అప్పుడు ఆయనకి సుమారు 40ఏళ్ళ ప్రాయం ఉండి ఉండవచ్చు. ఎప్పుడు చూసినా ఆయన చాలా ఉత్సాహంగా, హుషారుగా ఉంటారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న యువకులందరికి కూడా ఆయన ఒక మార్గదర్శకుడిగా ఉండి  అక్కడ యువజన సామాజిక కార్యక్రమాలన్నీ చేయిస్తూ ఉండేవారు. అక్కడ ఒక హనుమాన్ గుడి ఉండేది. ఆ గుళ్ళో హనుమత్ జయంతి ఇలాంటి వన్నీ ఆయన చురుకుగా చేయిస్తూ ఉండేవారు. మరి చుట్టుపక్కల అంతా ముస్లిమ్స్ ఉన్నప్పటికీ కూడా,ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళు అక్కడే స్థిరపడటం తోటి  ఆ ముస్లిం యువకులందరూ,పెద్దలందరూ కూడా ఈయన దగ్గరకి సలహా సంప్రదింపులకి వస్తూ వుండేవారు. అయితే ఆయన మాత్రం తన కొడుక్కి ఈ విద్యని నేర్పించలేదు. దానిలో చాలా సాధక బాధకాలు ఉంటాయని కూడా చెప్పారు. వారింట్లో ఒక దేవతా సర్పం ఉందని, అది ఇంట్లో తిరుగుతూ ఉంటుంది,సాధారణంగా ఎవ్వరికీ కనిపించదు,మా జోలికి రాదు. అది ఎన్నేళ్ళ నుంచో  ఆ గదిలో ఉంటు౦దని ఆయన చెప్పారు. ఈ విషయాలన్నీ మోహన్ కి  కొంత కుతూహలాన్ని రేకెత్తించాయి. తరువాత ఆయన అక్కడే శాలిబండ దగ్గరలో ఉన్న ఫూల్ భాగ్ లో ఒక పురాతన వేంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉందని, అది ఒకప్పుడు ఎంతో ప్రభావాన్ని కలిగి ఉండేదని, ఆ తరువాత ఆ చుట్టుపక్కల ఉన్న తురక వాళ్ళ  మూలంగా అక్కడ హిందువులు  రావడానికి భయపడి రావడం మానేయడం వల్ల క్రమక్రమంగా ఆ ఆలయం శిథిలమైపోయిందని, ఆ తరువాత అక్కడ మళ్ళా ఆ ఆలయాన్ని మేము పునః ప్రతిష్ఠ  చేయిస్తున్నా౦, ధ్వజస్తంభన స్థాపన కూడా చేయిస్తున్నా౦ కాబట్టి నీవు తప్పకుండా రావాలి అని చెప్పి మోహన్ ని ఆయన ఆహ్వానించారు. మోహన్ వయస్సులో ఆయన కంటే చాలా చిన్నవాడు అయినప్పటికీ ఆయన తనకిస్తున్న ప్రత్యేక గౌరవానికి  చాలా సంతోష పడిపోయాడు. “తప్పకుండా వస్తాను” అని చెప్పి ఆయన దగ్గర శెలవు తీసుకుని వెళ్ళిపోతుండగా, అక్కడికి ఇంకొక యువకుడు రావడం జరిగింది. ఆయనకి రాజా వారు మోహన్ ని పరిచయం  చేశారు. ఆయనకి కూడా ఇదే ఆహ్వానాన్ని అందించి, ఆయన తన కార్యక్రమాల కోసం లేచి వెళ్ళిపోయారు. ఇద్దరూ కలిసి రాజా వారికి నమస్కారం చేసి బయటికి వచ్చేశారు.

ఇద్దరూ అలా బయటకి వచ్చాక ఆయన మోహన్ తో దగ్గరలో ఉన్న ఒక టీ కొట్టుకి వెళ్దామని ఆహ్వానించారు. అలాగే సైకిల్ నడిపించుకుంటూ రోడ్డు దగ్గరగా వచ్చి, అక్కడే ఉన్న ఒక చిన్న టీ కొట్టు దగ్గర ఆగి అక్కడ బెంచ్ మీద కూర్చొని కొంత పిచ్చాపాటి మాట్లడుకోవడం ప్రారంభించారు. ప్రసంగవశాత్తు ఆయన తన పేరు వెంకట్రావు అని, వాళ్ళది తూర్పుగోదావరి జిల్లాలోని జమిందారీ కుటుంబం అని ప్రస్తుతం USAలో ఉంటున్నానని, అయితే వాళ్ళకి ఎంతో ఆస్తి ఉండటంతోటి అతని దాయాదులు, అతనంటే పడనివారందరూ కలిసి ఏవో క్షుద్రశక్తులు ఆయన మీద ప్రయోగించారని, అప్పట్నించి జీవితం నరకప్రాయమైపోయిందని, ఎప్పుడు ఆయన INDIAకు వచ్చినా, తన గృహానికి వెళ్ళినా అక్కడ దండెం మీద ఉన్న బట్టలన్నీ వాటంతటవే కాలిపోవటం, తరువాత ఆయన భోజనానికి కూర్చుందామని పీట మీదకూర్చోగానే ఆ పీట కింద ముళ్ళున్నట్టుగా ఆయన కూర్చోలేకపోవడం, కుర్చీలో కూడా కూర్చోలేకపోవడం , ఎంతసేపూ లేచి పచార్లు చేయాల్సిందే తప్ప కూర్చోవటం అనేది జరగటం లేదని, ఆహరంలో పురుగులు అవన్నీ కనిపిస్తూ భోజనం కూడా చేయలేని పరిస్థితిలో ఉండగా ఆయనకి కలలో వారి ప్రత్యక్ష దైవమయిన వేంకటేశ్వరస్వామి కనిపించి, నువ్వు ఫలానా చోట, ఫలానా ఆయన దగ్గరికి వెళ్ళవలసిందిగా చెప్పారని, ఆ ఆదేశం విని అతడు ఆశ్చర్యపడిపోయి, మరి అదే ప్రకారంగా హైదరాబాద్ వచ్చి ఎలాగో అలాగ రాజా ఆంజనేయప్రసాద్ గారి విలాస౦, మిగతా వివరాలన్నీ కనుక్కుని వచ్చానాని చెప్పారు. ఆయన రాజావారి గురించి మోహన్ ని వాకబు చేయగా, అతను కూడా తనకు జరిగినటువంటి అనుభవం, సరోజగారి విషయం ప్రస్తావించటం జరిగింది. ఆయన చెప్తున్న విషయాలను వింటుంటే చిన్నప్పుడు మోహన్ వాళ్ళ అమ్మగారు హైదర్ బస్తీలో ఉన్నప్పుడు జరిగిన కొన్ని వివరాలు అతనికి గుర్తుకు వచ్చాయి. ఆ రోజుల్లో మరి హైదరాబాద్ ని నైజాం రాజ్యం అనేవారు. విపరీతమైనటువంటి చేతబడులు అవి విపరీతంగా  జరిగేవని, మోహన్ వాళ్ళ అమ్మగారికి తెలిసిన కుటుంబం వారికి కూడా  ఇలాంటి ప్రయోగాలు జరిగినప్పుడు వారు మరి ఇంట్లో కూర్చునుండగా, ఆ ఇంటి మీద రేకులషెడ్డు పై టఫ టఫ అని రాళ్ల వర్షం కురిసేదని, బట్టలు వాటంతటవే కాలిపోయేవని, ఇలా ఎన్నో రకాలుగా ఆవిడ మోహన్ కి చెప్పారు. ఈయన ఉదంతం విన్నాక అవే మోహన్ కి గుర్తుకి వచ్చాయి. కానీ అతని మనస్సులో మరి నిత్యం పూజలు, పారాయణలు అన్నీ చేస్తున్నప్పటికి కూడా ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయి అన్న సందేహం మాత్రం ఎవ్వరు తీర్చలేకపోయారు.   ఆ తరువాత వాళ్ళిద్దరూ కూడా మరికొన్ని విషయాలు మాట్లాడుకున్నారు. వెంకట్రావుగారు, రాజా ఆంజనేయ ప్రసాద్ గారు తమ కోసం  పూజా కార్యక్రమాలన్ని చేస్తూఉన్నరని, ఇది కొంతకాలం పడుతుందని, ఎందుకంటే దుష్టశక్తులు విపరీతమైన శక్తి కలిగినవని చెప్పారని మోహన్ తో చెప్పారు. అక్కడితో ప్రసంగం ముగిసి వాళ్ళిద్దరూ ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. తరువాత మోహన్ తన ప్రయాణాన్ని సాగించాడు.